తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. సబ్ డివిజన్ కార్యాలయాల్లో ప్రతి నెల కోట్ల రూపాయల వ్యవహారాలు చేపడుతున్నారు. ఇంతటి విస్తృతి ఉన్నప్పటికీ సబ్ డివిజన్ కార్యాలయాలు దాదాపు అద్దె భవనాల్లో కునారిల్లుతున్నాయి. కొన్నిచోట్ల సొంత స్థలాలు ఉన్నప్పటికీ నిధులు మంజూరు కాకపోవటంతో ఏళ్ల తరబడి భవన నిర్మాణాలు చేపట్టడం లేదు. స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవటానికి సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. వినియోగదారులు, సిబ్బంది సౌకర్యానికి స్థలాల్లో భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
అద్దెల భారం.. అరకొర వసతి
మెదక్ టౌన్, సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: మెదక్ డివిజన్ పరిధిలో మొత్తం 11 చోట్ల తపాలా శాఖకు సంబంధించిన స్థిరాస్తులు ఉన్నాయి. మెదక్ పట్టణంలోని డివిజన్ కార్యాలయంతో పాటు ఉద్యోగుల నివాస సముదాయంలోని 12 గృహాలు, సిద్దిపేట ప్రధాన కార్యాలయంతో పాటు రెండు చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు దుబ్బాకలో పక్కా భవనం, గత ఏడాది నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చిన చేగుంట మండలంలోని మక్కరాజ్పేట, రామాయంపేటలో పక్కా భవనాలు ఉన్నాయి. సిద్దిపేట, చేగుంట, తూప్రాన్, టేక్మాల్ తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి. వీటిలో పక్కా భవనాల నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు పట్టించుకోవటంలేదు. ప్రతి నెల ఆ ప్రాంతాల్లో భవనాలకు అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. అద్దెల భారం పడటమే కాకుండా ఆయా భవనాల్లో సరైన సదుపాయాలు లేవు. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సిద్దిపేటలో స్థలానికి ప్రహరీ ఏర్పాటు
నిర్మాణానికి నిధుల లేమి
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి డివిజన్లో సంగారెడ్డి, జహీరాబాద్, రామచంద్రాపురంలలో తపాలా కార్యాలయాలు ఉన్నాయి. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో రెండు ఎకరాల స్థలాన్ని తపాలా శాఖకు 15 సంవత్సరాల క్రితం కేటాయించారు. ఈ స్థలంలో నిర్మాణాలు ఏవీ చేయకపోవడంతో మున్సిపల్ అధికారులు కూరగాయల మార్కెట్కు కేటాయించారు. అక్కడ ఉన్న తపాలా శాఖ బోర్డులను తొలగించారు. సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద స్థలాన్ని కార్యాలయానికి కేటాయించినా అది నిరుపయోగంగానే ఉంటోంది. భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించాలని వినియోగదారులు కోరుతున్నారు. మిగతా చోట్ల అన్ని పోస్టాఫీసులు అద్దె భవనాల్లో ఉండటంతో అరకొర వసతులతో సిబ్బంది, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
కూరగాయల మార్కెట్కు కేటాయించిన సంగారెడ్డి తపాలా శాఖ స్థలం
ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తాం
మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న తపాలా శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలు మా సంరక్షణలో ఉన్నాయి. ఆక్రమణాలకు గురికాకుండా కొన్ని చోట్ల ప్రహరీ నిర్మాణాలు చేపట్టాం. గత సంవత్సరమే రెండు ప్రాంతాల్లో పక్కా భవనాలు నిర్మించాం. మెదక్లోని నివాస సముదాయంలోని గదుల మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. సొంత స్థలాలు ఉన్న ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు పంపిస్తాం.
శ్రీహరి, పర్యవేక్షకుడు, మెదక్ డివిజన్ తపాలా కార్యాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
[ 03-07-2024]
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. -
బీమా లేదు.. పరిహారం రాదు
[ 03-07-2024]
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. -
అమ్మ లాలన.. మొక్క రక్షణ
[ 03-07-2024]
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. -
ఆనందం అంతలోనే పెను విషాదం
[ 03-07-2024]
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. -
చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
[ 03-07-2024]
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
[ 03-07-2024]
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. -
పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
[ 03-07-2024]
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. -
వన మహోత్సవానికి సిద్ధం
[ 03-07-2024]
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. -
ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
[ 03-07-2024]
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. -
అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?
[ 03-07-2024]
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
మల్గిలో దారుణం!
[ 03-07-2024]
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
[ 03-07-2024]
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
గురువు కోసం గుండెలు కరిగేలా..
[ 03-07-2024]
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 03-07-2024]
దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..