సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం.
‘న్యూస్టుడే’తో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. కలెక్టరేట్లో అధికారులు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు పెంచుతాం. తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుంటుందని..’ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. కలెక్టర్తో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించిది. వివరాలు ఇలా..
ప్రభుత్వ భూముల రక్షణ
జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వ భూముల్లో సూచికలు, కంచెలు ఏర్పాటు చేయాలని సూచించాం. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ఒక్క గుంట కూడా కబ్జా కాకుండా చూడాలని ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వ భూములకు సంబంధించిన కబ్జాలపై సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో విచారణ చేయిస్తున్నాం.
‘ధరణి’ దరఖాస్తులపై రోజువారీ సమీక్ష
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆర్డీవోలు, తహసీల్దార్లకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించాం. దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తున్నాం. పెండింగ్ దరఖాస్తులపై నిత్యం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నాం. అనర్హత గల దరఖాస్తులను తిరస్కరిస్తున్నాం. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించాం. మున్సిపాలిటీ కమిషనర్లను అప్రమత్తం చేశాం. నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతోపాటు దోమల నివారణకు ఆయిల్ బాల్స్ సిద్ధం చేయమని సూచించాం.
పర్యాటకాభివృద్ధి దిశగా
సంగారెడ్డి మండలం కల్పగూరు శివారులోని మంజీరను పర్యాటకపరంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకుసాగుతున్నాం. ఎకో టూరిజం విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. సందర్శకులు రాత్రి సమయంలోనూ ఇక్కడ విడిది చేసేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మంజీరకు రాంసర్ సైట్ జాబితాలో చోటు దక్కితే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమవుతుంది.
విద్యా సంస్థల్లో సదుపాయాల మెరుగుకు..
ప్రభుత్వ విద్యా సంస్థల్లో సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. కార్పొరేట్ సామాజిక (సీఎస్ఆర్) కింద పరిశ్రమల సహకారంతో జిల్లాలోని కస్తూర్బా, వసతి గృహాలు, ఆదర్శ పాఠశాలల్లో కనీస సదుపాయాల కల్పనకు కార్యాచరణ రూపొందించాం. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించాం.
ప్రజావాణి మరింత జవాబుదారీగా..
కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చిన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నాం. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారుల్ని ఆదేశించాం. అర్జీదారులకు తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేలా చరవాణికి సందేశం పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం. అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతాం.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
[ 03-07-2024]
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. -
బీమా లేదు.. పరిహారం రాదు
[ 03-07-2024]
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. -
అమ్మ లాలన.. మొక్క రక్షణ
[ 03-07-2024]
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. -
ఆనందం అంతలోనే పెను విషాదం
[ 03-07-2024]
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. -
చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
[ 03-07-2024]
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
[ 03-07-2024]
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. -
పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
[ 03-07-2024]
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. -
వన మహోత్సవానికి సిద్ధం
[ 03-07-2024]
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. -
ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
[ 03-07-2024]
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. -
అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?
[ 03-07-2024]
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
మల్గిలో దారుణం!
[ 03-07-2024]
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
[ 03-07-2024]
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
గురువు కోసం గుండెలు కరిగేలా..
[ 03-07-2024]
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 03-07-2024]
దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!