చిన్నారుల పెదాలపై చిరునవ్వు
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్
పరిశ్రమలో అధికారుల తనిఖీలు
న్యూస్టుడే, సిద్దిపేట: చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసు కమిషనర్ డా.బి.అనూరాధ నేతృత్వంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఆవిర్భావం నుంచి ఏడేళ్లలో 306 మందికి విముక్తి కల్పించారు.
సమష్టిగా శాఖలు..
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తప్పిపోయిన చిన్నారులను దర్పణ్ యాప్ ద్వారా గుర్తిస్తారు. బాల కార్మికులకు విముక్తి కల్పిస్తారు. బిక్షాటన చేసేవారికి, వీధి బాలలు, బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పిస్తారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లపై దృష్టి సారించి తనిఖీలు చేయనున్నారు. ఇందుకోసం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్లలో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు, బాలల సంక్షేమ సమితి, జిల్లా బాలల పరిరక్షణ, కార్మిక, విద్య, వైద్య విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది భాగస్వాములుగా ఉన్నారు.
నిబంధనల విస్మరణ..
గత ఏడాది ముస్కాన్ ద్వారా 48 మంది బాల కార్మికులను గుర్తించారు. 18 ఏళ్లలోపు వారిని పనుల్లోకి తీసుకోవద్దనే నిబంధన ఉన్నా యజమానులు విస్మరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బాలలను గుర్తించి బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపర్చనున్నారు. ఇతర రాష్ట్రాల వారైతే సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. కుటుంబ సభ్యులు, సంబంధీకులను రప్పించి కౌన్సెలింగ్ చేసి అప్పగిస్తారు. యజమానిపై చర్యలు తీసుకొంటారు.
సంరక్షణ కేంద్రాల్లో తనిఖీ..
జిల్లాలో ఐదు బాలల సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో సిద్దిపేట బాల సదనం, శిశుగృహ (ప్రభుత్వం) సహా బెజ్జంకి, కొండపాక, ప్రజ్ఞాపూర్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాలను సందర్శించి తప్పిపోయిన చిన్నారులను ‘దర్పణ్’(ముఖ గుర్తింపు) యాప్ ద్వారా గుర్తిస్తారు.
బాధ్యులపై చర్యలు తప్పవు
రాము, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి
సీపీ అనూరాధ, జిల్లా సంక్షేమ అధికారి శారద నేతృత్వంలో అన్ని శాఖల యంత్రాంగం సమన్వయంతో తనిఖీలు చేపడతాం. బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు. అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే డయల్-100 లేదా చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నం.1098 సంప్రదించాలి.
వలస కార్మికుల పిల్లలు ఎక్కువగా..
ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వందల సంఖ్యలో జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో సహా వలస వస్తున్నారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణం రంగం, ఇతర చోట్ల ఎక్కువ శాతం బాలలు పనుల్లో కనిపిస్తున్నారు. కీలకంగా మారాల్సి ఉన్న కార్మిక శాఖ నామమాత్రంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. అధికారులు తనిఖీ చేసినన్ని రోజులు దూరంగా ఉంటున్న బాలకార్మికులు తరువాత పనుల్లో చేరుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
[ 03-07-2024]
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. -
బీమా లేదు.. పరిహారం రాదు
[ 03-07-2024]
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. -
అమ్మ లాలన.. మొక్క రక్షణ
[ 03-07-2024]
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. -
ఆనందం అంతలోనే పెను విషాదం
[ 03-07-2024]
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. -
చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
[ 03-07-2024]
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
[ 03-07-2024]
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. -
పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
[ 03-07-2024]
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. -
వన మహోత్సవానికి సిద్ధం
[ 03-07-2024]
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. -
ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
[ 03-07-2024]
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. -
అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?
[ 03-07-2024]
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
మల్గిలో దారుణం!
[ 03-07-2024]
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
[ 03-07-2024]
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
గురువు కోసం గుండెలు కరిగేలా..
[ 03-07-2024]
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 03-07-2024]
దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!