logo

విధుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

విధుల్లో ఉండగా హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.

Published : 01 Jul 2024 00:55 IST

యాదగిరి

సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: విధుల్లో ఉండగా హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి విధుల్లో ఉండగా రాత్రి 12గంటల సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని తోటి ఉద్యోగి కానిస్టేబుల్‌ రాజుకు తెలిపాడు. వెంటనే వారు వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని ధ్రువీకరించారు. యాదగిరికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంత్యక్రియలను పోలీసులు అధికారికంగా నిర్వహించారు. యాదగిరి మృతికి సీపీ అనూరాధ సంతాపం తెలిపారు. మృతదేహానికి అడిషనల్‌ డీసీపీ రామచందర్‌రావు, ఏసీపీ మధు, సీఐ విద్యాసాగర్, పోలీసులు నివాళులర్పించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని