రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
న్యూస్టుడే, చేగుంట
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఎన్హెచ్ఏఐ అధికారులు మాత్రం తగిన చర్యలు చేపట్టడంలేదు. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పది మంది మేకల లోడ్తో రెండు రోజుల క్రితం స్వగ్రామాల నుంచి బయలుదేరారు. మరో గంటన్నరలో గమ్య స్థానానికి చేరుకుంటామని అనుకుంటున్న తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది. మేకల లోడుతో అతివేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నిద్రమత్తులో అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టాడు. ముందు వెళ్తున్న లారీలో దాణా సంచులు ఉంటేనే ఐదుగురు మృతిచెందారు. అదే కంటెయినర్ కానీ.. ఇతర లారీలు ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ.. రహదారి మధ్యలో ఆగిపోయింది. ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ పక్కకు నిలిపి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
ఓవైపు నుజ్జయిన మేకల లారీ
క్రేన్తో మృతదేహం వెలికితీత
ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. లారీలో వెనకాల కూర్చున్న వారిలో ఇద్దరు మృతిచెందారు. పూర్తిగా మేకల మధ్య ఇరుక్కుపోవడంతో తీయటం కష్టంగా మారింది. చేగుంట కానిస్టేబుల్ రాయుడు, స్థానికులతో కలిసి ఇరుక్కున్న ఒక మృతదేహాన్ని క్రేన్కు కట్టి అతికష్టంమీద బయటకు తీశారు. అప్పటివరకు నలుగురు మాత్రమే మరణించారని అనుకున్నారు. మొత్తం పదిమంది లారీలో వచ్చినట్లు ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి చెప్పటంతో వెతికారు. లారీలో ఉన్న మొత్తం మేకలను బయటకు తీయడంతో మరొకరి మృతదేహం కనిపించింది.
పాక్షికంగా దెబ్బతిన్న ధాన్యం లారీ
గతంలో ప్రమాదాలు
గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ఘటనలు జరిగాయి. ఇక్కడ జాతీయ రహదారి మరీ ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో గతంలో నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు రోడ్డు కిందికి దూసుకెళ్లటంతో ముగ్గురు మృతిచెందారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొనటంతో ఇద్దరు మరణించారు. చాలా సార్లు వాహనాలు ఢీకొనటం, బోల్తాపడటం వంటివి జరుగుతున్నాయి. మలుపులు ఉండటంతో వాహనాలు అతివేగంగా వస్తూ రోడ్డు కిందికి దూసుకెళ్లటమో లేక ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొనటమో జరుగుతున్నాయి. మలుపులు ఉన్న చోట యూ టర్నింగ్ ఉంది. వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు ఇవి కనిపించడం లేదు. అయినా ఎన్హెచ్ఏఐ అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మలుపులు, రోడ్డు ఎత్తుగా ఉండటం ప్రమాదాలు జరగటానికి కారణమవుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు బస్సులు కూడా ప్రమాదానికి గురయ్యాయంటే.. ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుస్తుంది.
మేకల లారీ నుంచి తీస్తున్న మృతదేహం
ఇతర వాహనంలో మేకల తరలింపు
ప్రమాదానికి గురైన లారీలో సుమారు 100 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రాణంతో ఉన్న మేకలను ఇతర వాహనంలో హైదరాబాద్కు తరలించారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ.. కాళ్లు విరిగిన 25 వరకు మేకలను వడియారం, రామంతాపూర్, మాసాయిపేటకు చెందిన వారు తీసుకెళ్లారు. చనిపోయిన వాటిని లారీలోనే వదిలేశారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి నుంచి వివరాలు తెలుసుకుంటున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి