స్వయం ఉపాధితో చక్కటి భవిత
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
నిరుద్యోగ యువతకు వరంగా మారిన శిక్షణ కేంద్రం
చరవాణి మరమ్మతులో శిక్షణ
న్యూస్టుడే-మెదక్: వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండేళ్ల కిందట ఏర్పాటైన ఈ శిక్షణ కేంద్రం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయగా.. మరికొందరు ఆయా చోట్ల ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. గతేడాది అదనంగా మరో రెండు కోర్సులను ప్రవేశపెట్టింది. మూడు నెలల పాటు కొనసాగే శిక్షణకు నామమాత్రపు రుసుమును వసూళ్లు చేస్తున్నారు. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం...
7 బ్యాచులు పూర్తి..
డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పించేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ ముందుకొచ్చింది. 2022 జూన్ 1న మెదక్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యాషన్ డిజైనింగ్-జరోసి, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్, మొబైల్ సర్వీసింగ్, సీసీ టీవీ మరమ్మతు, హౌజ్ వైరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన కోర్సులకు పదోతరగతి ఉత్తీర్ణులు లేదా అనుత్తీర్ణులై ఉండాలి. ఇప్పటి వరకు 7 బ్యాచ్లు పూర్తయ్యాయి. శిక్షణ పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రం ఇస్తారు.
832 మంది శిక్షణ పొంది..
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు 832 మంది శిక్షణ పొందారు. ఈ నెలాఖరుతో ఎనిమిదో బ్యాచ్ పూర్తికానుంది. ఎక్కువగా కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. తర్ఫీదు పొందిన వారిలో పలువురు స్వయం ఉపాధి పొందుతున్నారు. సుమారు 80 మంది వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. శిక్షణ పొందిన వారిలో మరికొందరు పలు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు.
1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం...
ప్రస్తుతం ఏడు కోర్సుల్లో తర్ఫీదునిస్తున్నారు. థియరీ తరగతులతో పాటు యంత్రాలు, పరికరాలతో శిక్షణ చేయిస్తున్నారు. కంప్యూటర్ కోర్సుకు రూ.1,000, మిగిలిన కోర్సులకు ఫీజు రూ.1,500, పరీక్ష ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు మూడు నెలల పాటు కొనసాగుతుంది. తొమ్మిదో బ్యాచ్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వచ్చే నెల 1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది.
10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
- నాగరాజు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి
నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం వరంగా మారుతోంది. కేంద్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయింది. ఏడు కోర్సుల్లో శిక్షణ పొందిన వారు ఉపాధి పొందుతున్నారు. కొత్త బ్యాచ్లో చేరే వారు వచ్చేనెల 10లోగా దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమో, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.