సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
న్యూస్టుడే, మెదక్ టౌన్
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఫిబ్రవరి నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ రూపంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ను సరఫరా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో పలువురు అర్హులైన లబ్ధిదారులకు రాయితీ డబ్బులు వారి ఖాతాలో జమకావడం లేదు.
ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 2.35 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం సుమారుగా 3 వేలకు పైగా సిలిండర్లను రీఫిల్లింగ్ చేసుకుంటున్నారు. ఇందుకు లబ్ధిదారులు గ్యాస్కు పూర్తి ధర చెల్లిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకు అదనంగా చెల్లించిన డబ్బులు రాయితీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ ఏజెన్సీ నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో రాయితీ డబ్బులు అందడం లేదు. సిలిండర్ తీసుకొని నెల, రెండు నెలలు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు ఖాతాలో జమకావడం లేదు. లబ్ధిదారుల నంబర్ ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో అవకతవకలు జరుగుతున్నాయా? లేక పొరపాటు చేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సక్రమంగా అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
- జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలు: 16
- మొత్తం కనెక్షన్లు: 2,35,412
- దీపం: 63,161
- ఉజ్వల: 33,618
- ఇతర: 1,38,633
కార్యాలయంలో సరి చేసుకోండి
- లక్ష్మినర్సింలు, ఎంపీడీవో కొల్చారం
మా వద్దకు వచ్చిన వాటిని సాధ్యమైనంత వరకు సరిచేశాం. ప్రజాపాలనలో ఇచ్చిన రసీదుతో మరోసారి ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి తప్పులు ఉంటే సరి చేసుకోండి. అయినప్పటికీ సంబంధిత ఖాతాలో డబ్బులు జమ కాకపోతే ప్రభుత్వం నుంచే పెండింగ్ ఉండే అవకాశం ఉంది.
రెండింటి డబ్బులు జమకాలేదు
- విజయ, ఔరంగాబాద్
గృహలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న గ్యాస్ సిలిండర్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి రెండు సార్లు సిలిండర్లను తీసుకున్నాను. ఇంతవరకు డబ్బులు జమ కాలేదు. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.