సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది.
పొదుపు సంఘాలకు డీసీసీబీ రుణాల అందజేత
రాష్ట్రంలో ప్రథమ స్థానం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్
మహిళా సంఘం సభ్యులకు రుణాలు అందిస్తున్న అధికారులు
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహకార బ్యాంకులు ప్రోత్సహిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాలకు రుణాలు అందిస్తున్నాయి. వసూలైన వడ్డీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో మెదక్ డీసీసీబీ మహిళా సంఘాలకు రుణాల మంజూరులో ముందంజలో నిలవడం విశేషం.
రాష్ట్రంలో మొత్తం 9 డీసీసీబీలు ఉన్నాయి. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ వ్యాపారాల నిర్వహణకు ప్రోత్సహిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా రూ.410 కోట్లు పంపిణీ చేశారు. గడిచిన ఐదేళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. 2022-23లోనూ ఇదే అంశంలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని దక్కించుకొని ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని అందుకున్న విషయం విదితమే.
ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం: సాధారణంగా వాణిజ్య బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలు అందించి ఊరుకుంటాయి. డీసీసీబీ ప్రతినిధులు రుణాలు ఇవ్వడంతో పాటు మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన పెంచడంపై ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. రుణం మంజూరుతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.
బీమా, ఇతర సదుపాయాలు..: సహకార బ్యాంకుల ద్వారా ప్రధానమంత్రి బీమా పథకాలను మహిళా సంఘాల సభ్యులకు అమలు చేస్తున్నారు. ఏడాదికి రూ.12 చెల్లిస్తే ప్రమాద బీమా, రూ.330తో సాధారణ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రమాద బీమా చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు, సాధారణ బీమా పథకంలో చేరిన వారు ఆత్మహత్య మినహా ఎలా మృతిచెందినా రూ.2లక్షలు, రెండు బీమా పథకాల్లో చేరితే రూ.4లక్షలు సాయం అందిస్తారు. వీటిని సంఘాల సభ్యులు వినియోగించుకునేలా చూస్తున్నారు.
కుటుంబానికి చేదోడుగా..
గజ్వేల్ మండలం బూర్గుపల్లికి చెందిన రేణుకది పేద కుటుంబం. ఏడాది కిందట స్థానిక మహిళా సంఘంలో చేరారు. డీసీసీబీ రుణం మంజూరు విషయం తెలుసుకున్న రేణుక.. ఆరు నెలల కిందట దరఖాస్తు చేసుకున్నారు. రూ.2 లక్షల రుణం మంజూరైంది. వీటితో గ్రామంలో పిండి గిర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వ్యాపారం ద్వారా వస్తున్న నగదుతో రుణ వాయిదాను చెల్లిస్తూనే, కుటుంబానికి చేదోడుగా నిలిచారు. గతంలోనూ రుణం తీసుకోగా, క్రమం తప్పకుండా చెల్లించారు. రానున్న రోజుల్లో వ్యాపారాన్ని విస్తరించాలని ఆమె యోచిస్తున్నారు.
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
సొంతంగా వ్యాపారం..
నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మమత..ఐదేళ్ల క్రితం బంతి పువ్వు పేరిట ఏర్పాటైన స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరారు. ప్రతి నెలా రూ.400 వరకు పొదుపు చేస్తూ వచ్చారు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో గ్రామైక్య సంఘం నుంచి రూ.2 లక్షలు, డీసీసీబీ నుంచి రూ.3 లక్షలు రుణం తీసుకొని శుద్ధిజల కేంద్రాన్ని ప్రారంభించారు. తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తూ ముందుకు సాగుతున్నారు. సంపాదనలో కొంత మేర పిల్లల చదువుకు వెచ్చిస్తున్నారు. భర్త ఆంజనేయులు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు.
న్యూస్టుడే, నర్సాపూర్
వడ్డీ తిరిగి ఇచ్చేస్తూ..
సంగారెడ్డి జిల్లాలోని మహిళా సంఘాలకు 2020 జులై 1 నుంచి వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి సంఘాల అభ్యున్నతికి తిరిగి ఇస్తుండటం విశేషం. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. డీసీసీబీ, సెర్ప్ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.కోటి వరకు జిల్లా సమాఖ్యకు అందజేశారు. ఇలా వెనక్కి ఇచ్చిన వడ్డీలో ఒక శాతం జిల్లా సమాఖ్య, 2 శాతం మండల సమాఖ్యలకు, మిగిలిన దాన్ని గ్రామైక్య సంఘాలకు కేటాయించి సంఘాల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!