సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది.
ఆయిల్పామ్ తోటల వివరాలు తెలుసుకుంటున్న ఐఎఫ్ఎస్ శిక్షణ అధికారులు
న్యూస్టుడే, ములుగు: పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన శిక్షణ ఉద్యోగులు, ఇతర ప్రాంతాల రైతులు క్షేత్రస్థాయి సందర్శనకు ఇక్కడికే వచ్చి అవగాహన పెంచుకుంటున్నారు. ఏకంగా ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ డీజీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి సాగు విధానాలు తదితర అంశాలను అడిగి తెలుసుకోవడం గమనార్హం. ఇలా మర్కుక్ అధ్యయన కేంద్రంగా మారడం విశేషం.
ప్రత్యేకతలు..: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మర్కుక్ మండలంలోనే వెద పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి ఈ కొత్త పద్ధతిలో పంట వేసి స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి నిరూపించారు. ఇక్కడి స్ఫూర్తితో వెదసాగు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు ఇక్కడే మొదలైంది. ఇందులో సాధారణ పద్ధతి కంటే ఎక్కువ మొక్కలు నాటుకోవడమే కాకుండా దిగుబడి సైతం అధికంగా వస్తుంది. దీన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు. వరిలో విత్తనోత్పత్తి కార్యక్రమానికి ఈ మండలంలోనే షురూ చేశారు. రైతులు తమ సొంత పొలాల్లో పండించిన పంట నుంచి విత్తనాలను ఉత్పత్తిచేస్తున్నారు.
వస్తున్నారిలా..: మర్కుక్ ఏవో టి.నాగేందర్రెడ్డి స్థానిక రైతులను కొత్త పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలు, సాగు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉన్నతాధికారులు తరలివస్తున్నారు. ఇటీవల ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ డీజీ క్యూయూ డొంగ్యూ ఆధ్వర్యంలో అధికారుల బృందం మర్కుక్ మండలంలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. తాజాగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ శిక్షణ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యాన అధికారులు పర్యటించారు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు ఇక్కడికి వచ్చి అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నారు.
మిరప తోట
నిత్య ఆదాయం..: మరోవైపు నిత్యం ఆదాయం వచ్చేలా ప్రతి ఒక్క రైతు తమ భూమిలో సగం మేర కూరగాయలు వేసేలా చైతన్యం తీసుకొచ్చారు. ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయల మార్కెట్ అందుబాటులోకి రావడంతో రైతులకు కలిసొచ్చింది. ఫలితంగా అత్యధికులు టమాట, వంగ, సొర, బీర, బీన్స్, చిక్కుడు, దొండకాయ, బెండ వంటివి పండిస్తున్నారు. బిందుసేద్యం ద్వారా నీటిని అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM