కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది.
వేలిముద్ర సేకరించే పరికరం ఎల్1
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ: ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. మీసేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి)లలో ప్రస్తుతం వినియోగిస్తున్న బయోమెట్రిక్ పరికరాల (ఎల్0) స్థానంలో కొత్తవి వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జులై 1 నుంచి కొత్త పరికరాలు (ఎల్1) ఉపయోగించాలని పేర్కొన్నారు.
ఐదు వందలకు పైగా కేంద్రాలు
జిల్లాలో 209 మీసేవ కేంద్రాలు, 310 కామన్ సర్వీస్ సెంటర్లు, వేలాది మినీ బ్యాంకులు, వివిధ బ్యాంకుల కస్టమర్ సర్వీస్ పాయింట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల హాజరు ఉపకార వేతనాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఈ-కేవైసీ చేస్తుంటారు. ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రం కొత్త పరికరాన్ని కొనుగోలు చేసే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే అన్ని కేంద్రాల వారూ బయోమెట్రిక్ కొత్త పరికరాన్ని కొనుగోలు చేశారు. వేలిముద్రల పరిరక్షణలో భద్రత దృష్ట్యా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్1 బయోమెట్రిక్ పరికరాన్ని వినియోగించడం తప్పనిసరని ఈ-జిల్లా మేనేజర్ ఆనంద్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.