ఫోన్ పోతే దొరుకునులే..
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు.
సీఈఐఆర్ పోర్టల్తో సత్ఫలితాలు
842 మందికి ఊరట
న్యూస్టుడే, సిద్దిపేట
కోల్పోయిన ఫోన్లను తిరిగి పొందిన బాధితులతో సీపీ అనూరాధ
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. కొన్నాళ్లుగా ఆ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. పోగొట్టుకున్న ఫోన్ను తిరిగి సులువుగా పొందేందుకు ప్రవేశపెట్టిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ 20 నుంచి నుంచి ఇప్పటి వరకు 842 సెల్ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు.
2,522 మంది ఫిర్యాదు
జిల్లాలో మొత్తం 26 పోలీసు ఠాణాలు ఉన్నాయి. ఆయా ఠాణాల పరిధిలో పోర్టల్ అందుబాటులోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 2522 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లకు సంబంధించి సమీప పోలీసు ఠాణా, మీసేవ కేంద్రాలు, సాంకేతికతపై పట్టున్న వారు నేరుగా ఆన్లైన్ వేదికగా ఫిర్యాదు చేసే విధానం అమలవుతోంది. www.ceir.gov.in వెబ్సైట్కు లాగిన్ కావాలి. అందులో సూచించిన మేర ఫోన్ నంబరు, ఐఎంఈఐ సంఖ్య, కంపెనీ పేరు, మోడల్, బిల్లు వివరాలతో పాటు ఏ తేదీ.. ఎక్కడ పోయింది.. ఇతరత్రా వివరాలతో ఫిర్యాదు నమోదు చేయాలి. బాధితుని పేరు, చిరునామా, గుర్తింపు పత్రం, ఓటీపీ కోసం మరో చరవాణి నంబరు, మెయిల్ ఐడీని నిక్షిప్తం చేయాలి. ఈ ప్రక్రియ పూర్తవగానే ఐడీ నంబరు వస్తుంది. తద్వారా చరవాణి వివరాలు(స్థాయి) తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు ఆయా వివరాల నమోదుతో 24 గంటల వ్యవధిలో చరవాణి పనిచేయకుండా బ్లాక్ చేస్తారు. ఎవరు వినియోగించారనేది గుర్తించేందుకు నిఘా పెడతారు. ఫోన్ స్వాధీనం చేసుకున్న తరువాత ఐడీ నంబరు ద్వారా తిరిగి చరవాణి అన్బ్లాక్ చేసి వినియోగించేలా చర్యలు తీసుకుంటారు.
బాధితులకు బాసట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పు మొదలైంది. కొన్ని సందర్భాల్లో బాధితులకు గంటలు, రోజుల్లో లభ్యమవుతున్నాయి. మరికొన్ని కేసుల్లో నెలల సమయం పడుతోంది. కోల్పోయిన, దొంగతనానికి గురైన ఫోన్ తిరిగి పొందే విధానం, సీఈఐఆర్ పోర్టల్ పనితీరుపై పోలీసులు, కళాబృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసు కమిషనర్ అనూరాధ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. ‘నూతన సాంకేతికత సాయంతో పోయిన ఫోన్లను తిరిగి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు ఎలాంటి సంకోచం లేకుండా సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఫోన్ ఏదైనా ప్రతి సమాచారం ముఖ్యమే. ఒకవేళ కోల్పోతే.. సంబంధిత పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయాలి.’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి