బడుగులపై పిడుగు
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు.
అందని ప్రభుత్వ ఆర్థిక సహాయం
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. గత ఆరేళ్లలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. ఇందుకు సంబంధించి, పోలీసు, రెవెన్యూ శాఖల నివేదికలను ప్రభుత్వానికి పంపించినప్పటికీ.. వారికి అందాల్సిన రూ.5 లక్షల పరిహారం ఆరేళ్లలో ఒక్కరికీ మంజూరు కాలేదు. - న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, జోగిపేట, కోహీర్, గుమ్మడిదల.
కౌలు రైతు కన్నీటి గాథ
పాపయ్య భార్య భారతమ్మ, కుమారుడు పాండు
అందోలు మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య ఈ ఏడాది మే 7న పిడుగు పడి మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న పొలంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పాపయ్యకు భార్య భారతమ్మ ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండేవారు. 15 ఏళ్ల క్రితం కూతురు దుర్గ చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం పెద్ద కుమారుడు మహేష్ బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది మే నెలలో పాపయ్య అకాల మరణంతో కుటుంబ భారమంతా చిన్న కుమారుడు పాండుపై పడింది. భర్త మరణంతో భారతమ్మ అనారోగ్యం పాలైంది.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో..
భిక్షపతి కూతుళ్లు సంజన, లాస్య
గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన భిక్షపతి ఈ ఏడాది మే నెలలో పిడుగుపడి మృతి చెందారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు సంజన, లాస్య ఉన్నారు. పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి పెద్ద దిక్కు మరణంతో.. ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. విజయలక్ష్మి కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివిస్తోంది. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.
అనాథలైన ఇద్దరు పిల్లలు
తండ్రి బుచ్చయ్యతో పిల్లలు(పాత చిత్రం)
పిడుగు పడి తల్లి, అనారోగ్యంతో తండ్రి మరణించడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. కోహీర్ పట్టణానికి చెందిన బుచ్చయ్య, స్వప్న భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు అభిషేక్, సంజన. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొన్నేళ్ల క్రితం బుచ్చయ్య కాలు విరగడంతో మంచాన పడ్డారు. స్వప్న భర్తకు సపర్యలు చేస్తూ పిల్లలను చదివించేది. 2023, నవంబరు 8న పొలం పనులు ముగించుకొని వస్తుండగా పిడుగుపడి మృత్యువాత పడింది. నెల క్రితం బుచ్చయ్య ఆరోగ్యం విషమించి మరణించాడు. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదు. స్వప్న తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ, అభిషేక్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు.
ప్రభుత్వానికి నివేదిక అందజేశాం
జిల్లాలో పిడుగులు పడి మృతి చెందిన వారి జాబితాతో నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. వారికి రావాల్సిన రూ.5 లక్షల నష్ట పరిహారం ఇప్పటికీ మంజూరు కాలేదు. మంజూరైన వెంటనే నేరుగా బాధిత కుటుంబీకులకు చెక్కుల రూపంలో రెవెన్యూ అధికారులు అందజేస్తారు.
పద్మజారాణి, డీఆర్వో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు
[ 01-07-2024]
అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. -
కస్తూర్బా బాలికలకు కష్టాలు!
[ 01-07-2024]
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
[ 01-07-2024]
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
పశు వైద్యం.. గగనం
[ 01-07-2024]
పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
[ 01-07-2024]
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. -
కుటుంబ భారం మోస్తూనే సాధన
[ 01-07-2024]
అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. -
తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..
[ 01-07-2024]
తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
భక్తుడిపై దాడి
[ 01-07-2024]
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. -
సమగ్ర ప్రగతికి సమష్టి కృషి
[ 01-07-2024]
‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. -
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
[ 01-07-2024]
రాష్ట్రంలోని వికారాబాద్-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. -
చిన్నారుల పెదాలపై చిరునవ్వు
[ 01-07-2024]
చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
[ 01-07-2024]
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ మూడో ఠాణాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన కూచనపల్లి యాదగిరి(50) పట్టణ మూడో ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు.