వరి సాగు పై సందిగ్ధం
వానాకాలం సీజన్లో వరి సాగు చేద్దామనుకున్న రైతులు వర్షాలు లేక మదనపడుతున్నారు.
వర్షాల్లేక ముందుకు సాగని నారుమడులు
నీటి ఎద్దడిపై రైతుల్లో అంతర్మథనం
గజ్వేల్లో ఇంకా వరి నారు పోయకుండా కనిపిస్తున్న మడికట్లు
గజ్వేల్, న్యూస్టుడే: వానాకాలం సీజన్లో వరి సాగు చేద్దామనుకున్న రైతులు వర్షాలు లేక మదనపడుతున్నారు. వర్షాలు వస్తాయా? వరి సాగు చేద్దామా? వద్దా? అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువు, వాగుల్లో నీరు చేరితే పంట సునాయాసంగా గట్టెక్కుతాయి. వర్షాలు తక్కువగా కురిస్తే పంట పాలు తాగే దశలో నీటి ఎద్దడి నెలకొంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి.
ఆలస్యంపై ఆందోళన
మేడిగడ్డ మరమ్మతుల నేపథ్యంలో ఎత్తిపోతలు సాగుతాయా? ప్రాజెక్టుల్లో నీటిని నింపుతారా? అనేదానిపై స్పష్టత లేకపోవటం రైతులను కలవరపెడుతోంది. ఏటా రైతులు రోహిణి కార్తెలో వరి నారుమడులు సిద్ధం చేసుకొని నెల రోజులు దాటగానే నాట్లు ప్రారంభిస్తారు. రోహిణి కార్తె దాటిపోయినా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాతిక శాతం కూడా నారుమళ్లు సిద్ధం కాలేదు. సాగు ఆలస్యం అవుతుండటం పట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. గత యాసంగి సాగు వరి నాట్లు జనవరి 15 వరకు పూర్తవ్వాల్సి ఉండగా ఫిబ్రవరి నెలఖారు వరకు సాగాయి. ఫలితంగా జిల్లాలో వరి నూర్పిళ్లు మే నెలాఖరు వరకు సాగాయి.
బోరు మోటార్లే ఆధారం
రోహిణి కార్తెలో వరి నార్లు పోసుకుంటే పంటలకు చీడపీడలు ఆశించక ఆశాజనక దిగుబడి వస్తుందని రైతులు విశ్వసిస్తుంటారు. కానీ చేతికొచ్చిన యాసంగి ధాన్యం ఆరబెట్టుకోవటం, మార్కెట్లకు తరలించి విక్రయించడం పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఇప్పుడిప్పుడు రైతులు పొలాలకు నీరు పెట్టడం ప్రారంభించారు. కొన్ని చోట్ల ఇంకా మోటార్లు తిప్పడం ఆరంభించనే లేదు. ఫలితంగా ఈ వానాకాలం సీజన్ సైతం నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? జూన్లో పోసిన నారు జూలైలో నాటు వేస్తే నవంబర్లో కోతకు వస్తుంది. అంటే అక్టోబరులోనే వర్షాకాలం ముగియనుంది. పూర్తిగా బోరు మోటార్లపైనే ఆధారపడి వరి పంటను గట్టెక్కించాల్సి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోహిణిలో నారు పోయకుండా నాట్లు వేస్తే చీడపీడలకు మందులు పిచికారి, దిగుబడి కోసం అధికంగా ఎరువుల వాడాల్సి వస్తుందని, దీంతో ఖర్చు కూడా పెరిగిపోతుందని అంచనా వేసుకుంటున్నారు.
3 లక్షల ఎకరాల్లో వరి
జిల్లాలో మూడు లక్షల మంది రైతులున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 3 లక్షల ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1.80 లక్షల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో కంది సాగయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో సుమారు 1.60 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 1.70 లక్షల బోరు బావులు ఉన్నట్లు అంచనా. మొత్తంగా దోబూచులాడుతున్న కాలంతో కర్షకులు పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
-
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!