సాగు పెరిగేలా.. అవసరాలు తీరేలా..
డిమాండ్కు అనుగుణంగా సాగు ఉండాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
ఉద్యానశాఖ కార్యాచరణ
షేడ్నెట్ కింద కూరగాయల సాగు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: డిమాండ్కు అనుగుణంగా సాగు ఉండాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలోని పట్టణాలకు సరిపడా సాగు విస్తీర్ణం ఉండేలా చూడటంతోపాటు రాష్ట్ర రాజధాని వాసుల అవసరాలు తీర్చేలా ముందుకు సాగేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఇందుకోసం వానాకాలం సీజన్కు ప్రణాళిక ఖరారు చేశారు.
లక్ష్యం 29,705 ఎకరాలు: పంట విత్తు నాటే సమయం నుంచి కోతకొచ్చి ఉత్పత్తులను మార్కెట్కు తరలించేదాకా అన్నదాతలకు కష్టాలే. దిగుబడులు ఆశించిన మేర రావడంతోపాటు గిట్టుబాటు ధర దక్కితేనే ఆరుగాలం శ్రమకు ఫలితం ఉంటుంది. వానాకాలంలో మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధర దక్కేలా రైతులను సరైన బాటలో నడిపించే దిశగా ఉద్యాన శాఖ ముందుకు సాగుతోంది. గతేడాది వానాకాలంలో 28,291 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేశారు. ఈ సారి విస్తీర్ణం వెయ్యి ఎకరాల మేర పెరుగుతుందని అంచనా వేశారు. 29,705 ఎకరాలు సాగుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు.
అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలు
జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా ఏయే కూరగాయల సాగు విస్తీర్ణం ఎంతమేర పెంచాలనే అంచనాలను సిద్ధం చేశారు. జిల్లా జనాభా 15.27 లక్షలు ఉండగా ప్రతి సంవత్సరం కూరగాయలు 1.17 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. జిల్లాలో 1.16లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు మాత్రమే పండిస్తున్నారు. టమాట, వంకాయ అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నాయి. కొన్నిరకాల కూరగాయలు అవసరానికి మించి సాగు చేస్తుండగా మరికొన్ని అవసరాలకు సరిపడా సాగుచేయక పోవడంతో ఇతర ప్రాంతాలపై ఆధార పడాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయలు సాగు తక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. పండ్ల తోటల విస్తీర్ణం పెంచే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. డిమాండ్ను బట్టి సాగు చేయాల్సిన పంటలపై రైతులను చైతన్యం చేసేందుకు ఉద్యానశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.
మార్కెట్ సదుపాయం ఎక్కువే: గుమ్మడిదల, సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, జహీరాబాద్, హత్నూర, మొగుడంపల్లి, కోహీర్ తదితర మండలాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పండ్లు, పూలు, కూరగాయలను జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జరిగే సంతల్లో విక్రయిస్తుంటారు. ఇక్కడి నుంచే హైదరాబాద్కు కూడా తరలిస్తుంటారు. హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో మిగతా జిల్లాలతో పోల్చితే జిల్లాకు అనుకూల పరిస్థితులు ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
శ్రమకు ఫలితం దక్కేలా ప్రణాళికలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల శ్రమకు ఫలితం దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏయే పంటలు ఎంతమేర సాగు చేయాలన్న అంశాలతో అంచనాలు రూపొందించాం. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సాగు చేస్తేనే గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఉద్యాన రైతులు లాభాల దిశగా పయనించేలా చూస్తాం.
-సోమేశ్వరరావు, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల జిల్లా అధికారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్