కస్తూర్బాలు భళా
అనాథలు, నిరుపేద విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది.
పాఠశాలలు, కళాశాలల్లో లక్ష్యానికి మించి ప్రవేశాలు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: అనాథలు, నిరుపేద విద్యార్థినులు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాలను నిర్వహిస్తోంది. ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయి. అధునాతన తరగతి గదులు, ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటా పది, ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో పేద బాలికలను వీటిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే వీటిలోనే ఉత్తమ బోధన అందుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చదువుతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంలో కస్తూర్బా పాఠశాలలు, కళాశాలల్లో లక్ష్యానికి మించి ప్రవేశాలు ఉండటం గమనార్హం.
విద్యతో పాటు క్రీడల్లో రాణింపు
జిల్లాలో 20 కస్తూర్బా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 10 చోట్ల జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. కస్తూర్బాల్లో నిర్వహణకు ప్రత్యేకాధికారులు, బోధనకు సీఆర్టీలు(క్లస్టర్ రిసోర్స్ టీచర్స్) తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మెరుగైన విద్యతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఏటా అధికారులు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. సీఆర్టీలు బాలికలకు అర్థమయేలా ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. బాలికలకు గుణాత్మక విద్య అందించడంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తున్నారు. రెగ్యులర్ తరగతులతో పాటు ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రక్షణకు ప్రత్యేకంగా ఏఎన్ఎంలను నియమించారు. చదువుతో పాటు కరాటే, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. కస్తూర్బాల విద్యార్థినులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధిస్తూ.. ప్రత్యేకతను చాటుతున్నారు. వార్షిక పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థినులు ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేలా ఈఏపీ సెట్, నీట్ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ
కస్తూర్బాల్లో చదివే విద్యార్థినుల కోసం కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గత విద్యా సంవత్సరం కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు అమలు చేశారు. బాలికలకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. ఈ ఏడాది బ్రైటర్ మైండ్ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం 90 మంది ఉపాధ్యాయినులు, కొందరు విద్యార్థినులకు జూన్ రెండో వారంలో ఐదు రోజుల పాటు శంషాబాద్లోని కన్హ శాంతి వనంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అక్కడ నేర్చుకున్న విద్యార్థినులు తోటి విద్యార్థులకు ప్రతి రోజు అవగాహన కల్పిస్తున్నారు.
చేరేందుకు ముందుకు వస్తున్నారు
కస్తూర్బాల్లో చదివే విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వీరికి చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో ఎక్కువ మంది చేరేందుకు ముందుకు వస్తున్నారు.
- సుప్రియ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.