చిన్నతరహా.. ఉపాధి మెరువ..
యువతను ప్రోత్సహిస్తున్నాంచిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాం.
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ప్రోత్సహిస్తే ప్రయోజనం
సంగారెడ్డిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు
- గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సంగారెడ్డి జిల్లాలో 272 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో రూ.3,455 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ పరిశ్రమలతో 17,950 మందికి ఉపాధి లభిస్తోంది. ఈ సంవత్సరం 55 ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు వచ్చాయి.
- సిద్దిపేట జిల్లాలో రూ.3,949 కోట్ల పెట్టుబడితో 174 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వీటిలో 8,826 మందికి ఉపాధి లభిస్తోంది.
- వికారాబాద్ జిల్లాలో 8 మాత్రమే చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 30 ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరికీ కొలువులు దక్కడం కష్టమే. నిరుద్యోగిత తగ్గాలంటే ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిందే. ఇదే ఉద్ధేశంతో ప్రభుత్వం పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తోంది. యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సహకారం అందిస్తోంది. చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటుచేసే వారికి రాయితీ పథకాలు సైతం అమలుచేస్తోంది. నేడు ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహక దినోత్సవం’ సందర్భంగా కథనం.
ద్వితీయ స్థానంలో సంగారెడ్డి: పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉంది. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల్లో ఈ సంవత్సరం జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉండటం విశేషం. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహం మాత్రం అంతంతమాత్రంగా ఉంది. ప్రభుత్వపరంగా సాయం అందిస్తే చిన్నతరహా పరిశ్రమలు భారీగా నెలకొల్పేందుకు యువత సిద్ధంగా ఉంది. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా ప్రోత్సాహం కరవైంది.
బ్యాంకర్లు సందేహాలు తీర్చాలి: ప్రభుత్వం రాయితీ నిధుల్ని ఆలస్యంగానైనా విడుదల చేస్తున్నా బ్యాంకర్ల తీరుతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు కావడంతో తాము ఇచ్చే రుణాన్ని తిరిగి చెల్లిస్తారో లేదోనన్న అనుమానిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ మంజూరు చేసినా బ్యాంకు రుణం అందకపోవడంతో యూనిట్లు గ్రౌండింగ్కు నోచని పరిస్థితి. బ్యాంకు అధికారులు తీరు మార్చుకుంటే ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజ్ఞప్తులు ఇవీ: చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే భూమి కేటాయించాలి. ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో భూమిని కొనుగోలు చేసి పరిశ్రమల ఏర్పాటు కష్టంగా మారింది.
- వ్యవసాయానికి ఇస్తున్న మాదిరిగా ఏడాది వరకైనా ఉచిత విద్యుత్తు నిరంతరం ఇవ్వాలి.
- నీటి కనెక్షన్ సదుపాయం కల్పించాలి.
- రాయితీ నిధుల విడుదల జాప్యం లేకుండా చూడాలి.
- బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు అధికారులు చొరవ చూపాలి.
న్యూస్టుడే, జిన్నారం: జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో మూడేళ్ల క్రితం ఎంఎస్ఎంఈ ద్వారా రూ.5 కోట్ల రుణం పొందిన ఓ పరిశ్రమ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ ద్వారా రూ.18 కోట్ల టర్నోవర్ సాగుతుండగా 65 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పరోక్షంగా మరో 40 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.20 లక్షల దాకా వివిద రకాల ప్రభుత్వ సంస్థలకు పన్నుల రూపేణా చెల్లిస్తుంది.
- ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూనిట్ రూ.4 కోట్ల రుణం పొందింది. ఎలక్ట్రానిక్స్ సామగ్రిని తయారు చేసే ఈ పరిశ్రమ వల్ల 45 మంది ప్రత్యక్షంగా 32 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ విభాగాలకు రూ.12 లక్షల దాకా పన్నులు చెల్లిస్తున్నారు. సమీపంలో హోటల్ వంటి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
- ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు చేసే పరిశ్రమను రూ.8 కోట్లతో ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ యూనిట్ టర్నోవర్ 22 వేలకు చేరింది. 80 మందికి ఉపాధిని ఇవ్వటంతో పాటు రూ.30 లక్షల దాకా పన్నులు చెల్లిస్తున్నారు.
యువతను ప్రోత్సహిస్తున్నాం
చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు అనుమతులు జారీ చేస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే 55 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి.
ప్రశాంత్కుమార్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM