ఆన్లైన్లో నిత్యావసరాల నమోదు
వసతిగృహాల్లో ఉండే వస్తువులు పక్కదారి పట్టకుండా మరింత సమర్థంగా నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది
కస్తూర్బా పాఠశాలల్లో అమలు
అక్రమాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
చిన్నశంకరంపేట కస్తూర్బాలో వివరాలు నమోదు చేస్తున్న ప్రత్యేక అధికారిణి గీత
న్యూస్టుడే, మెదక్ : వసతిగృహాల్లో ఉండే వస్తువులు పక్కదారి పట్టకుండా మరింత సమర్థంగా నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అధికారులు హాస్టల్ మేనేజ్మెంట్ ఆన్లైన్ సిస్టం రూపకల్పన చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
జిల్లాలో కేజీబీవీలు 15 వరకు ఉన్నాయి. వీటిలో 4,022 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాలలకు నిత్యావసర సరకులు, కూరగాయలు, తదితర సామగ్రి సరఫరాకు జిల్లాస్థాయిలో టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేసి అందిస్తున్నారు. ప్రతి రోజూ వచ్చిన సరకుల ప్రారంభ నిల్వ, వినియోగించాక ముగింపు నిల్వలను రికార్డుల్లో రాస్తున్నారు. విద్యాలయాల్లో అకౌంటెంట్లు ఈ విధులను నిర్వహిస్తున్నారు.
పక్కా పర్యవేక్షణ...
మండల, జిల్లాస్థాయి అధికారులు తనిఖీలు చేసి రికార్డుల పరిశీలించినప్పుడు సరకుల కొరత నిల్వల్లో తేడాలు గుర్తిస్తున్నారు. నిబంధనల మేరకు చికెన్, పాలు, గుడ్లు సరఫరా చేయకుండా టెండరుదారుతో కుమ్మకై పక్కదారి పట్టించడం లాంటి అక్రమాలు గతంలో బయటపడ్డాయి. కొన్ని సార్లు సరకుల వివరాల నమోదు చేయని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టి వాటి ఉపయోగాన్ని, నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తీసుకొచ్చిన ఆన్లైన్ సిస్టం ద్వారా రోజూ సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
నమోదు చేయాల్సినవి...
నిత్యం http:- /// Scholledu.- telangana.- gov.- in /KGBV_UAT/scholl వెబ్సైట్లో విద్యార్థుల సంఖ్య, క్రితం రోజు ముగింపు నిల్వ ఆరోజు ప్రారంభ నిల్వగా పేర్కొంటూ ఏ రోజుకారోజు గుత్తేదారు అందించిన సరకుల వివరాలు ఎంతమేర వంటలకు వినియోగించారు.. రాత్రి భోజనం తర్వాత ఎంతమేర నిల్వ ఉందో నమోదు చేయాలి. గత నెలలో కస్తూర్బా పాఠశాలల్లో ట్రయల్రన్ చేసి ఈనెల నుంచి అమలు చేస్తున్నారు. దీంతో గుత్తేదారు సకాలంలో సరకులు తెస్తున్నారా లేదా అనేది ఉన్నతాధికారులు నిత్యం గమనించే అవకాశం ఉంటుంది. రోజువారీ నిర్వహణలో నగదు చెల్లించాల్సి వస్తే ఆ వివరాలు కూడా నమోదు చేసేలా వీలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం కేవలం కస్తూర్బా పాఠశాలల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో ఆదర్శ పాఠశాల, గురుకులాల్లో అమలు చేయనున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో అమలు -సుకన్య, జీసీడీవో
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కస్తూర్బా పాఠశాలల్లో హస్టల్ మేనేజ్మెంట్ ఆన్లైన్ సిస్టం అమలు చేస్తున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక అధికారిణులు అన్ని వివరాలు పొందుపర్చాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు