భూమాతకు ఆరోగ్య కార్డులు
భూమిలో సారం బాగుంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అందులో సారం ఎంత ఉందో రైతులకు తెలియదు.
నేల స్వభావం తెలుసుకొనేందుకు మట్టి నమూనాల సేకరణ
పైలట్ ప్రాజెక్టుగా నార్సింగి మండలం
సేకరిస్తున్న మట్టి నమూనాలు
న్యూస్టుడే, చేగుంట: భూమిలో సారం బాగుంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అందులో సారం ఎంత ఉందో రైతులకు తెలియదు. ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులను వాడుతుంటారు. దీనివల్ల పెట్టుబడులు ఎక్కువ కావడంతో పాటు భూమిలో సారం తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకొనేందుకు మట్టి నమూనాలు ఉపయోగపడతాయని భావించిన కేంద్రం.. భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టింది. నేల స్వభావాన్ని బట్టి ఎరువుల వినియోగించేలా.. అనువైన పంటలు సాగు చేసే విధంగా అన్నదాతలకు అవగాహన పెంచేందుకు ఇవి ఎంతో ఉపకరించనున్నాయి. గతంలో చేపట్టి వదిలేసిన భూసార పరీక్షలు మళ్లీ పురుడు పోసుకోనున్నాయి. జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 2024-25 సంవత్సరానికి జిల్లాలో నార్సింగి మండలాన్ని గుర్తించారు. ఈ మండలంలో 1607 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నార్సింగి మండలంలో 12,356 ఎకరాల భూమి ఉంది. ఇందులో 8035 ఎకరాలు సాగు భూమిగా వినియోగంలో ఉంది. 5439 మంది రైతులు ఉన్నారు. అలాగే 1680 ఎకరాలు నల్లరేగడి, 1250 ఎకరాలు ఎర్ర నేలలు, 5105 ఎకరాలు చల్క నేలలు ఉన్నాయి.
ఇలా చేస్తారు: వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) తన క్లస్టర్లో రెండున్నర ఎకరాలు(హెక్టారు)కు ఒక మట్టి నమూనా సేకరించాలి. ప్రతి క్లస్టర్లో ఓ ఆదర్శ రైతును ఎంపిక చేసుకొని రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రదర్శన క్షేత్రం నిర్వహించాలి. ప్రయోగాత్మకంగా తీసుకున్న చోట జులై 10 లోపు నమూనాల సేకరణ పూర్తి చేయాలి. మట్టి నమూనాల వివరాలను సాయిల్ హెల్త్కార్డు పోర్టల్ మోబైల్ యాప్లో నమోదు చేయాలి. జులై 31 వరకు పరీక్ష కేంద్రంలో నమూనాల విశ్లేషణ పూర్తి చేయాలి. ఆగస్టు రెండో వారంలో పరీక్ష ఫలితాలను రైతులకు ఆరోగ్య కార్డు రూపంలో పంపిణీ చేయాలి.
పైలట్ ప్రాజెక్టుగా
జిల్లాలో చాలా మండలాల్లో ముందుగానే సాగు ప్రారంభమైంది. రామాయంపేట ఏడీఏ పరిధిలోని నార్సింగి మండలంలో కొంత ఆలస్యంగా నాట్లు, ఇతర పంటలు వేయనున్నారు. అందుకే ఇక్కడ మొదలుపెట్టాలని అధికారులు భావించారు. ముందుగా వానాకాలం సీజన్లో 40 శాతం పూర్తిచేసి మిగతాది ఏడాదిలో పూర్తిచేసి ఇవ్వనున్నారు. మట్టి నమూనా తీసిన ప్రతి చోట నేలకు సంబంధించిన ఆరోగ్య కార్డు ఇవ్వనున్నారు. ఆ కార్డును బట్టి ప్రతి సీజన్లో రైతులు ఎరువులు వేసుకోవటానికి అవకాశం ఉండనుంది.
రెండున్నర ఎకరాలకు ఒక నమూనా
గతంలో 25 ఎకరాలకు ఒక మట్టి నమూనా సేకరించేవారు. ఇప్పుడు మాత్రం రెండున్నర ఎకరాలకు ఒకటి చొప్పున తీయనున్నారు. దీంతో ప్రతి అంగుళంలో మట్టి గురించి తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీనిద్వారా ఏ నేలలో ఎంత మేర రసాయన ఎరువులు వాడవచ్చని తెలుస్తోంది. ఒక్కోచోట ఒక్కో విధంగా భూమి లోపల నిల్వలు ఉంటాయి. మట్టి నమూనాల వల్ల ఆ భూమిలో ఎంతమేరకు ఎలాంటి ఎరువులు వాడవచ్చునో పూర్తిగా తెలిసిపోతుంది. దీనిని బట్టి రైతులకు ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా భూమిలో సారం పెరిగి దిగుబడులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఆరోగ్య కార్డుల ద్వారా రైతుకు తన భూమి ఎంతమేరకు సారవంతమో తెలిసి ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నార్సింగి మండలంలో పూర్తిస్థాయిలో విజయవంతం అయితే జిల్లా వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. రైతులు మట్టి నమూనాలు తీసి ఇస్తే వారికే మేలు జరుగుతుంది.
రైతులకు ఎంతో ప్రయోజనం: గోవింద్, డీఏవో
మట్టి పరీక్షలు చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలో నార్సింగిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయటం జరిగింది. మట్టి నమూనాలు సేకరించిన చోట రైతులకు నేల ఆరోగ్య కార్డు ద్వారా ఫలితాలు అందిస్తాం. అందులో భూమికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఇది రైతుల వద్ద ఉంటే ఏ పంట సాగుచేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఎరువుల మోతాదు ఎంత అనే విషయాలు ఏవోలు, ఏఈవోల ద్వారా తెలుసుకొని పంటలను పండించుకోవచ్చు. మట్టి నమూనాల సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.