విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
కూరగాయలు పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ రాజ్
రేగోడ్, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రేగోడ్ తహసీల్ కార్యాలయం, కస్తూర్బా బాలికల విద్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల పనితీరు, నిర్వహణకు సంబంధించిన పలు దస్త్రాలను పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి బాధితులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో తరగతి గదులు, వంటశాల, కూరగాయలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. తహసీల్దార్ బాలలక్ష్మి, ప్రత్యేక అధికారిణి స్వయంప్రభ తదితరులున్నారు.
అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య
మెదక్: అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు, అప్పటి వరకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. ఆయా జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విశ్వకర్మ పథకంపై ప్రచారం
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. ఈ పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక బృందాలు, పట్టణాభివృద్ధి సంస్థ రిసోర్స్ పర్సన్స్ల ద్వారా ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. పీఎం స్వనిధి, ముద్ర, పీఎంఈజీపీ ద్వారా రుణం పొంది తిరిగి చెల్లించడంలో విఫలమైన వారు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి అనర్హులని తెలిపారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ గుల్షన్ సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ ఇందిరా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి నాగరాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహ మూర్తి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.