వ్యయం తగ్గి.. వెలుగులు పంచేలా
విద్యుత్తు ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్ పురపాలిక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి సౌర విద్యుత్తు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.
తూప్రాన్ పురపాలిక కార్యాలయంపై సౌర పలకలు
భవనంపై ఏర్పాటు ఇలా..
న్యూస్టుడే, తూప్రాన్: విద్యుత్తు ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్ పురపాలిక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి సౌర విద్యుత్తు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. రూ.20లక్షలకు పైగా నిధులతో కార్యాలయంపై సౌర పలకలను ఏర్పాటు చేశారు. పురపాలిక కార్యాలయంతో పాటు విభాగినులపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలకు నెలకు రూ.2లక్షల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఈ వ్యయాన్ని తగ్గించుకునేందుకు అధికారులు ఆలోచనలు చేశారు. జిల్లా కలెక్టర్ అనుమతితో రూ.20.60లక్షల నిధులతో సౌర పలకల యూనిట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పురపాలిక కార్యాలయం, విభాగినులపై ఏర్పాటు చేసిన దీపాలకు సైతం విద్యుత్తును వినియోగించేలా ప్రణాళికలు చేశారు. ప్రస్తుతం కార్యాలయంపై సౌర పలకల బిగింపు పూర్తయ్యింది. త్వరలోనే దీనిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రూ.24లక్షలకు పైగా ఆదా
తూప్రాన్ పురపాలికలో నెలకు రూ.2లక్షలకు పైగా విద్యుత్తు బిల్లులను చెల్లిస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.24లక్షలకు పైగా వ్యయం అవుతోంది. సౌర పలకల ద్వారా ఏడాదిలో ఈ వ్యయం పూర్తికానుంది. 5 ఏళ్ల వరకు గ్యారంటీ ఉండగా 30ఏళ్ల వరకు వినియోగంలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో దీని ద్వారా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్తును సైతం విద్యుత్తు శాఖకే విక్రయించేందుకు వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై వీటిని ఏర్పాటు చేయగా పురపాలిక కార్యాలయంపై ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఇది విజయవంతమైతే ఉమ్మడి జిల్లాలోని అన్ని పురపాలిక కార్యాలయాలపై దీనిని ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే దీనిని ప్రారంభించి సోలార్ ద్వారానే విద్యుత్తు వెలుగులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బిల్లులు అధికంగా రావడంతో కొన్ని విద్యుత్తు దీపాలను సైతం పూర్తిగా ఆన్ చేయడం లేదు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగనుండటంతో రాత్రి సమయంలో నిరంతరం పురపాలికలో విద్యుత్తు వెలుగులు విరజిమ్మనున్నాయి.
సద్వినియోగం చేసుకుంటాం: ఖాజామొయినొద్దీన్, కమిషనర్ పురపాలిక, తూప్రాన్
తూప్రాన్ పురపాలిక కార్యాలయంపై రూ.20లక్షలకు పైగా నిధులతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. ప్రధానంగా పురపాలిక కార్యాలయంలో విద్యుత్తు బిల్లులను ఆదా చేసేందుకే దీనిని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.