అతివలకు అండగా మెప్మా
మహిళా సంఘాల బలోపేతం కోసం పురపాలికలు కృషి చేస్తున్నాయి. గతేడాది అన్ని పురపాలికల్లో వంద శాతంపైగా రుణ లక్ష్యాలను సాధించాయి.
బ్యాంకు లింకేజీ రుణాలతో ఆర్థికాభివృద్ధి
సమావేశంలో సూచనలిస్తున్న మెప్మా అధికారులు
న్యూస్టుడే-మెదక్: మహిళా సంఘాల బలోపేతం కోసం పురపాలికలు కృషి చేస్తున్నాయి. గతేడాది అన్ని పురపాలికల్లో వంద శాతంపైగా రుణ లక్ష్యాలను సాధించాయి. అదే ఉత్సాహంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణను ప్రారంభించాయి. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రూ.33.54 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బ్యాంకర్లను సంప్రదించి రుణాలు ఇప్పించే బాధ్యతను మెప్మా సీవోలు, ఆర్పీలకు అప్పగించారు. రుణాలు లభిస్తే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పురపాలికల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు అందించి తోడ్పాటు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం...
గతేడాది రూ.46.01 కోట్లు
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయా పురపాలికల్లో రుణాలను అందించారు. నాలుగు పురపాలికల్లో 379 సంఘాలకు రూ.32.15 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 456 సంఘాలకు రూ.46.01 కోట్లు సంఘాలకు అందజేశారు. జిల్లా కేంద్రం మెదక్లో 165 సంఘాలకు రూ.17.83 కోట్లు, తూప్రాన్లో 106 సంఘాలకు రూ.11.18 కోట్లు, నర్సాపూర్లో 108 సంఘాలకు రూ.9.18 కోట్లు, రామాయంపేటలో 77 సంఘాలకు రూ.7.81 కోట్లు పంపిణీ చేశారు. సంఘాల పరంగా కాకుండా బ్యాంకు లింకేజీ పరంగా 143శాతం రుణాలను అందజేశారు. ఈ రుణాలతో మహిళలు ఎంబ్రాయిడరీ, మగ్గం పనులు, టైలరింగ్, బ్యూటీపార్లర్, గాజులు, చెప్పుల దుకాణాలను ఏర్పాటు చేసుకోగా, పలువురు పచ్చళ్ల తయారీ చేపడుతున్నారు. మరికొందరు మహిళలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించే వ్యాపార నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఇంకా కొందరు పాడి గేదెలను కొనుగోలు చేసి పాలను విక్రయిస్తున్నారు. ఇటీవల ఆయా పురపాలికల్లో సంఘాల సభ్యులు ప్రభుత్వ పాఠశాలల ఏకరూప దుస్తులను కుట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అందజేసే రుణాల లక్ష్యం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.
లక్ష్యం సాధిస్తాం: ఇందిర, జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్, మెప్మా
గతేడాది ఆయా పురపాలికల్లో బ్యాంకు లింకేజీపరంగా శతశాతం రుణాలను అందజేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 396 సంఘాలకు రూ.33.54 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించాం. బ్యాంకర్ల సహకారంతో మహిళా సంఘాలకు రుణాలు అందిస్తాం. రుణం తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించాలి. అప్పుడే తిరిగి కొత్త రుణాలు ఇచ్చేందుకు వీలుంటుంది. తీసుకున్న రుణాలను సంఘాల బాధ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వ్యాపారాభివృద్ధికి వినియోగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.