ఉపాధికి బాసట
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కని పరిస్థితి.
పీఎంఈజీపీ ద్వారా నిరుద్యోగులకు రాయితీ రుణాలు
గొల్లగూడెంలో పాడి పశువుల యూనిట్ను పరిశీలిస్తూ..
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్, జోగిపేట, పుల్కల్, వికారాబాద్ కలెక్టరేట్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కని పరిస్థితి. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లోనూ ఖాళీలు లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చి స్వయం ఉపాధి పొందేలా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం రాయితీ రుణ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చేందుకు వీలుగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుండటం విశేషం.
విభాగాల ద్వారా..: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే పీఎంఈజీపీ. ఆసక్తి ఉన్న యువత నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపికైన వారికి రాయితీ రుణాలు అందజేస్తూ చేయూత అందిస్తున్నారు. ఇందులో ఉత్పత్తి పరిశ్రమలకు, వ్యక్తులు, సంస్థలకు రూ.25 లక్షలు, ఉత్పత్తేర (సర్వీసు) పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రాయితీ రుణాలు అందజేస్తారు. డీఐసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్), కేవీఐసీ (ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్), కేవీఐబీ (ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు) విభాగాల ద్వారా యూనిట్లు మంజూరు చేస్తున్నారు.
ఎప్పుడైనా దరఖాస్తుకు అవకాశం
పీఎంఈజీపీ సాయం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు అంటూ ఏదీ ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ.www.kviconline.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి. వివిధ రకాల ధ్రువపత్రాలు సమర్పించాలి. దరఖాస్తులను బ్యాంకులకు పంపిస్తారు. నిర్దేశించిన మేర అర్హతలు ఉండి ఎంపికైన అభ్యర్థుల ఖాతాల్లో రాయితీ నిధులు జమ చేస్తారు.
సాంకేతికతను జోడించి..
పరిపూర్ణాచారి స్వగ్రామం పుల్కల్. సంగారెడ్డిలోని తారా కళాశాలలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో తమ కులవృత్తి వడ్రంగిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న లక్ష్యంతో పీఎంఈజీపీ పథకానికి దరఖాస్తు చేశారు. 35 శాతం రాయితీతో రూ.10 లక్షల రుణం మంజూరైంది. సీఎన్సీ డిజైనింగ్ యంత్రం కొనుగోలు చేశారు. దీంతో పనిని వేగంగా పూర్తిచేయగలుగుతున్నారు. మరో ఐదుగురికి ఉపాధి చూపుతున్నారు.
రూ.20 లక్షల రుణంతో..
బెజ్జంకికి చెందిన భువనగిరి గంగారాం భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ పనులు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. రెండు నెలల కిందట పీఎంఈజీపీ కింద 35 శాతం రాయితీపై రూ.20 లక్షలు రుణంగా తీసుకున్నారు. వీటితో భవన నిర్మాణ సంబంధిత సామగ్రిని పెద్దమొత్తంలో కొనుగోలు చేశారు. కొన్ని రోజులుగా పెద్ద భవనాల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. తద్వారా మరో 20 మందికి పని కల్పించే స్థాయికి చేరారు. సిద్దిపేటలోని యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో తరగతులకు హాజరై నైపుణ్యాన్ని పెంచుకున్నారు. తన పనిలో మరింత పట్టు సాధించారు.
సద్వినియోగం చేసుకోవాలి:
ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాయితీ రుణాలకు ఆన్లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం రాయితీ నిధుల్ని మంజూరు చేసినప్పుడు గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.
ప్రశాంత్కుమార్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్, సంగారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.