మల్లన్న ఆలయ నిర్వహణ ఇష్టారాజ్యం
కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్వహణలో రోజుకో వివాదం.. అక్రమం వెలుగుచూస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నాయి.
ఇన్ఛార్జి ఈవోతో కొరవడిన పాలన
కొమురవెల్లి మల్లన్న ఆలయం
న్యూస్టుడే, చేర్యాల: కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్వహణలో రోజుకో వివాదం.. అక్రమం వెలుగుచూస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు నుంచీ ఏటా లక్షలాది భక్తులు మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. ఏటా రూ.18 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి ఆలయ నిర్వహణపై పట్టింపు ఉండటం లేదు. పూర్తికాలం కార్యనిర్వహణాధికారిని నియమించకపోవడంతో స్థానిక సిబ్బంది, నాయకుల ఇష్టారాజ్యంగా మారింది. మూడున్నరేళ్లుగా ఇన్ఛార్జి పాలనలో రోజుకో వివాదం వెలుగు చూశాయి. తాజాగా సిబ్బంది పరస్పరం దాడులు చేసుకోవడం గమనార్హం.
హాజరు పుస్తకంలో దిద్దుబాట్లు
ఎవరికి వారే.. హాజరు తీరే..
- ఈ ఏడాది ఫిబ్రవరిలో వీఐపీ, దాతల ఉచిత పాసులను విక్రయించిన అక్రమం వెల్లడైంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పొరుగు సేవలు, తాత్కాలిక సిబ్బంది అక్రమాలకు తెర లేపారు. బ్రహ్మోత్సవాలలో దర్శనం పాసులను ఒక్కోటి రూ.1,500కు అమ్మారు. ఐదుగురు సిబ్బందిపై పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
- ‘మల్లన్న’ ఆలయంలో 2020-21 నుంచి 2022-23 వరకు గుడికి సంబంధించిన ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ విషయంలో అధికారులు నమ్మిన ప్రైవేటు ఆడిటర్ ధనుంజయ్ (హైదరాబాద్) మోసం చేశాడు. ఒప్పందం ప్రకారం మూడేళ్లకు రూ.17.50 లక్షలు ఆలయ అధికారులు అతడికి ఇచ్చారు. ప్రభుత్వానికి కేవలం రూ.3.30 లక్షలు మాత్రమే చెల్లించాడు. ఆడిటర్ను అరెస్టు చేసి, డబ్బు రికవరీ చేశారు.
- కల్యాణోత్సవం పురస్కరించుకొని ముఖ్య అతిథుల కోసం తెచ్చిన పరుపులను అపహరించారు. రూ.లక్ష విలువైన ప్లంబర్ సామగ్రి చోరీకి గురైంది.
- కొందరు అధికారులు, సిబ్బంది వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతారు. వచ్చిన రోజే హాజరు పుస్తకంలో పాత తేదీల్లో సంతకాలు చేసుకుంటారు. ఇది ఇక్కడ సర్వసాధారణం. గైర్హాజరని, సెలవని ఈవో రిజిస్టరులో రాసినా దాని పైనే సిబ్బంది కొందరు సంతకాలు చేయడం గమనార్హం. ఈ వ్యవహారమే ఇటీవల సిబ్బంది దాడి చేసుకునేలా చేసింది.
రెండు రోజులే ఈవో..
ఆలయానికి ఇన్ఛార్జి ఈవో ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతమున్న ఆలూరు బాలాజీకి మరో మూడు చోట్ల అదనపు బాధ్యతలున్నాయి. వారానికి రెండు రోజులు మాత్రమే కొమురవెల్లికి రాగలుగుతున్నారు. పూర్తిస్థాయి ఈవో లేక అభివృద్ధి పనుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం సుమారు రూ.30 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. 2018లో మంజూరైన 50 గదుల ధర్మశాల నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వీటికి తోడు అత్యధునిక క్యూకాంప్లెక్స్, ‘మల్లన్న’ గుట్టపై త్రిశూలం, డమరుకం ఏర్పాటు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ