అటవీ విద్య.. భవితకు మార్గదర్శి
ఉన్నత విద్యా ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం.
దరఖాస్తుకు 27వ తేదీ చివరి గడువు
క్షేత్రస్థాయి సందర్శనలో విద్యార్థినులు
న్యూస్టుడే, ములుగు: ఉన్నత విద్యా ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం. ఇప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు దక్కాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలు, కళాశాలలో చేరే తీరు, తదితర అంశాలపై కథనం.
అటవీ నిర్వహణను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అటవీ విద్యను ప్రవేశపెట్టింది. ఇందుకు 2016లో అటవీ విద్యకు సంబంధించి బీఎస్సీ కోర్సును ప్రారంభించారు. మొదట్లో హైదరాబాద్ కొంపల్లి సమీపంలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో కళాశాలను షురూ చేశారు. 2018లో సిద్దిపేట జిల్లా ములుగులో సొంత భవనాలను నిర్మించగా.. అప్పటి సీఎం కేసీఆర్ కళాశాలను ప్రారంభించారు. ప్రస్తుతం బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
రూ.72 కోట్లు.. 52 హెక్టార్లు
అటవీ కళాశాల పరిశోధనా కేంద్రానికి సంబంధించిన భవనాలను రూ.72 కోట్లతో నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో కూడిన తరగతి గదులు, పరిశోధనా కేంద్రాలు, విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలు కొలువుదీరాయి. అధ్యాపకులు, సిబ్బంది ఉండేందుకు ప్రత్యేకంగా వసతిగృహాలను ఏర్పాటుచేశారు. పరిశోధన కేంద్రానికి 52 హెక్టార్లను కేటాయించారు. ఆటలాడేందుకు మైదానాన్ని ఏర్పాటు చేశారు.
కోర్సుల వివరాలు..
బీఎస్సీలో ఏటా 65 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఎమ్మెస్సీలో 20 మంది చేరేందుకు అవకాశం ఉంది. పీహెచ్డీలో ఐదు నుంచి పది మందికి మాత్రమే అవకాశం. ఇప్పటివరకు అటవీ శాస్త్రంలో బీఎస్సీ పూర్తిచేసిన 250 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. వీరిలో కొందరు ఉద్యోగాలు సాధించగా, మరికొందరు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఎమ్మెస్సీ పూర్తిచేసిన 40 మంది ఇక్కడి నుంచి బయటకు వెళ్లారు. పీహెచ్డీ విద్యార్థుల పరిశోధనలు కొనసాగుతున్నాయి.
వివిధ అంశాలపై శిక్షణ..
అటవీ కళాశాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా తేనెటీగల పెంపకం, సేంద్రియ ఎరువుల తయారీ, నర్సరీల ఏర్పాటు, వుడ్ వర్క్షాప్పై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. బోధనలో భాగంగా విద్యార్థులను దేశంలోని పలు ప్రాంతాలకు క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకువెళ్తున్నారు. అక్కడి అడవుల గురించి వివరిస్తూ అవగాహన పెరిగేలా కృసి చేస్తున్నారు. కేంద్రంలోని నర్సరీలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఆటల్లోనూ రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. వ్యాయామం, యోగా వంటివి నిత్యం తప్పనిసరి. పోటీ పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్నూ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో చదువుతో పాటు పలు విభాగాల్లో రాణించిన పలువురు విద్యార్థులు గవర్నర్ రాధాకృష్ణన్ నుంచి బంగారు పతకాలు అందుకున్నారు.
అవకాశాలు ఇలా..
ప్రస్తుతం కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అటవీ శాస్త్రానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ర్యాంకుల ఆధారంగా 50 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. పేమెంట్ ఆధారంగా 10 మంది, ఈడబ్ల్యూఎస్ ద్వారా మరో ఐదుగురికి ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేయడానికి గడువుంది.
వెబ్సైట్: www.fcrihyd.in
ఫోన్ నంబర్లు: 80743-50866, 96664-60939
మెయిల్: fcriadmissions@gmail.com
సద్వినియోగం చేసుకోవాలి
ఆశ, కళాశాల పరిశోధన కేంద్రం డీన్
దేశంలో ఎక్కడా లేనివిధంగా అధునాతన సౌకర్యాలతో కూడిన కళాశాల పరిశోధన కేంద్రాన్ని ప్రభుత్వం ములుగులో ఏర్పాటు చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిత ఖాయం. ఇక్కడి అవకాశాలను ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త