పాన్ ఉంటేనే పరిహారం
చేపలు పట్టి, విక్రయిస్తూ జీవనం గడిపే మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
మత్స్యయోజనకు కొత్త మార్గదర్శకాలు
చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు
న్యూస్టుడే గజ్వేల్ గ్రామీణ, సిద్దిపేట అర్బన్, మెదక్ టౌన్, సంగారెడ్డి టౌన్: చేపలు పట్టి, విక్రయిస్తూ జీవనం గడిపే మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. చేపలు పట్టేందుకు వెళ్లి నీటి వనరుల్లో మునిగి అత్యధికులు చనిపోతుంటారు. వీరికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. మత్స్యసహకార సంఘాల్లో సభ్యత్వం పొంది స్థానిక చెరువుల్లో వేటాడుతుంటారు. ప్రమాదవశాత్తు గాయపడిన, మరణించిన వారికి మత్స్యశాఖ నుంచి వచ్చే పరిహారం పొందేందుకు పాన్ కార్డుతో పాటు ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతోమందికి పాన్ కార్డులు, ఆదాయ పత్రాలు లేకపోవడం గమనార్హం. వెంటనే వాటిని తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జీఏఐఎస్ వెబ్సైట్లో..
మత్స్యకారులు సంఘ సభ్యత్వం గుర్తింపు సంఖ్య, ఆధార్, బ్యాంకు ఖాతా, చరవాణి నంబరు, పాన్ కార్డు నంబరుతో పాటు ఆదాయ ధ్రువీకరణపత్రం జీఏఐఎస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సంఘం సభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రీమియం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే పీఎం మత్స్యయోజన కింద రూ.5 లక్షలు, శాశ్వత అంగవైకల్యమైతే రూ.2.5 లక్షలు, క్షతగాత్రులైతే రూ.25 వేలు చెల్లిస్తారు.
సంతకం రాకుంటే ఇబ్బందులు
మత్స్యకారులకు ప్రమాద బీమా బాగానే ఉన్న కొత్త మార్గదర్శకాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పాన్ కార్డు పొందాలంటే సంతకం తప్పనిసరి. ఎవరైనా చదువు రాని వారుంటే పాన్ కార్డు పొందడం కాసింత కష్టమే. ఆదాయ ధ్రువీకరణ ఇచ్చేందుకు ముందుకొచ్చినా పాన్ కార్డు నిబంధనతో సభ్యులు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పలువురు విన్నవిస్తున్నారు.
నమోదు చేసుకోవాలి: మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిద్దిపేట
మత్స్యకారులు వెంటనే పాన్ కార్డు తీసుకొని సదరు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. లేదంటే పరిహారం చెల్లింపు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. సంఘంలో సభ్యత్వానికి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM