రక్షణ శూన్యం.. అదుపు తప్పితే ప్రమాదం
జిల్లాలో రహదారుల వెంట పాత బావులు ప్రమాదకరంగా మారాయి. రక్షణగోడలు లేకుండా, పొదల మధ్య, మలుపుల వద్ద ఇవి ఉండడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
రోడ్ల పక్కన బావులతో భయాందోళన
జిల్లాలో రహదారుల వెంట పాత బావులు ప్రమాదకరంగా మారాయి. రక్షణగోడలు లేకుండా, పొదల మధ్య, మలుపుల వద్ద ఇవి ఉండడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాటిని పూడ్చడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో రోడ్లవెంట పురాతన బావులున్నాయి. ఆ మార్గాల్లో ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పాత జైలు సమీపంలోని దుర్గమ్మ దేవాలయం పక్కనే ఏళ్లనాటి బావి ఉంది. బసవేశ్వరనగర్ కాలనీలో మలుపు వద్దా ఇదే పరిస్థితి. ఈ రెండు చోట్లా ప్రమాదాలు సంభవించాయి.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, నారాయణఖేడ్, జోగిపేట, కోహీర్, కంది, వట్పల్లి, హత్నూర.
ఖేడ్ పట్టణంలో రోడ్డు పక్కన
పల్లెల్లో భయంగా
కోహీర్ మండలం మనియార్పల్లి, ఖానాపూర్, బిలాల్పూర్, సజ్జాపూర్, పీచేర్యాగడి, నాగిరెడ్డిపల్లి, రాజనెల్లి, గుర్జువాడ, తదితర గ్రామాల్లో రోడ్ల పక్కన వ్యవసాయ బావులున్నాయి. బిలాల్పూర్లోని బావిలో డ్రైవర్ అందులో పడి దుర్మరణం చెందారు. సమీపంలోని బావుల్లో కుటుంబ కలహాలు, తదితర కారణాలతో పలువురు వాటిల్లో దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ట్రాక్టర్ అదుపు తప్పి..
నారాయణఖేడ్లో జాతీయ, అంతర్గత రహదారుల పక్కన సుమారుగా 45 చోట్ల వ్యవసాయ బావులున్నాయి. కొన్నిచోట్ల మూలమలుపులు ఉండడం, ఆ పక్కనే బావులు కనిపించకుండా పోవడం వల్ల అందులో పడి చనిపోయిన ఘటనలున్నాయి. నారాయణఖేడ్ పురపాలక పరిధి మన్సూర్పూర్లో గతంలో ట్రాక్టర్ అదుపు తప్పి బావిలోపడి చోదకుడు మృతి చెందారు.
ద్విచక్రవాహనంపై వెళుతూ..
హత్నూర మండలం వడ్డేపల్లి, చిక్మద్దూర్, దౌల్తాబాద్, హత్నూర, సికింద్లాపూర్, తదితర గ్రామాల్లో సమీపంలో రోడ్ల పక్కనే బావులున్నాయి. గతంలో పొలాలకు నీరందించినవి మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. వడ్డేపల్లి శివారులోని బావిలో పటాన్చెరు మండలం బండ్ల రామేశ్వర గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అందులో పడి మరణించారు.
ఇక్కడా దృష్టి సారించాల్సిందే..:
- మండల కేంద్రమైన కందిలో మంజీర పైపులైన్ ఉంది. ఇక్కడికి ఇళ్ల సమీపంలో వ్యవసాయ బావికి రక్షణగోడ లేదు. పైౖకప్పులేక పోవడం వల్ల సమీప గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
- వట్పల్లి నుంచి దుద్యాల వెళ్లే దారి పక్కనే వ్యవసాయ బావులకు రక్షణ గోడలేదు. ఆ దారిలో ప్రయాణం చేసే వాహనదారులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తోందోనని ఆందోళనకు గురవుతున్నారు.
- అందోలు మండలం నేరడిగుంట బావిలో గతంలో ట్రాక్టర్ చోదకుడు పడి మృతిచెందాడు.
పూడ్చివేతకు చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న బావులను గుర్తించి వాటి చోట్ల రక్షణ చర్యలు తీసుకునేలా కృషి చేస్తాం. ఆర్అండ్బీ, పీఆర్, డీపీవో శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రహదారుల పక్కన పొదల మధ్య ఉంటే, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే వాటిని పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటాం. - చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, సంగారెడ్డి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..