ఉత్తర్వులు.. ఉత్తమాటేనా!
పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతోంది.. ఇక సేవలు పొందడం సులువేనని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు.
ఏర్పాటు కానీ పాస్పోర్టు సేవా కేంద్రం
కేంద్రం ఏర్పాటుకు గుర్తించిన తపాలా కార్యాలయం
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్: పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతోంది.. ఇక సేవలు పొందడం సులువేనని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉత్తర్వులు వెలువడి ఆరేళ్లు గడిచినా ఏర్పాటు ప్రక్రియ అడుగు ముందుకు పడడంలేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు రెండో పెద్ద పట్టణంగా పేరొందిన జహీరాబాద్లో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2018 మే 18న విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత తపాలా శాఖ సమన్వయంతో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో సేవా కేంద్రం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించినా, నేటికి ప్రతిపాదనలకే పరిమితమైంది. ఉన్నత చదువులు, ఉద్యోగం, ఉపాధి, పర్యటక ప్రాంతాల సందర్శన తదితర అవసరాలకు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జహీరాబాద్లో పాస్పోర్టు సేవా కేంద్రం అందుబాటులోకి వస్తే జహీరాబాద్ సహా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, పటాన్చెరు, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, కోహీర్ ప్రాంత ప్రజలకు పాస్పోర్టు పొందడం సులువుగా మారేది. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి)తో పాటు ఆటోమొబైల్, ఐస్క్రిమ్ పరిశ్రమలతో ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందిన జహీరాబాద్కు మరో ప్రత్యేక గుర్తింపు దక్కేది.
వ్యయ ప్రయాసలు..: జిల్లా వాసులు పాస్పోర్టు పొందాలంటే హైదరాబాద్, మెదక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అంతర్జాలంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కొన్నిసార్లు కచ్చితంగా అభ్యర్థి హాజరు కావాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో జహీరాబాద్లో సేవా కేంద్రం అందుబాటులో ఉంటే వ్యయ ప్రయాసలు తప్పుతాయి. జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, కోహీర్, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి అత్యధికంగా దుబాయ్, సౌదీ అరేబియా గల్్్ఫ దేశాలతో పాటు అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం ఎక్కువగా వెళ్తుంటారు. ఇలాంటి వారికి ప్రాంతీయంగా సేవా కేంద్రం అందుబాటులోకి వస్తే మరింత ఊరట కలగనుంది. కేంద్రం మంజూరు చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అప్పటి సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ ఉత్తర్వును ఆరేళ్ల కిందట అప్పటి ఎంపీ బీబీపాటిల్కు అందజేశారు. కొత్త లోక్సభ కొలువుదీరిన వేళ ప్రస్తుత ఎంపీ సురేష్షెట్కార్ దృష్టిసారిస్తే ఎదురు చూపులు ఫలించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ