పత్తాలేని.. ప్రత్యేక సమావేశం!
మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటేనే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రతినెలా ప్రత్యేకంగా ద్వితీయ సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది.
నెరవేరని సర్కార్ లక్ష్యం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటేనే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రతినెలా ప్రత్యేకంగా ద్వితీయ సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. పర్యవేక్షణ లేక క్షేత్రస్థాయిలో చాలా చోట్ల సక్రమంగా అమలు కావడంలేదు. ఈ ప్రక్రియ పక్కాగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై కథనం.
మహిళా సంఘం సభ్యులు నెలకోసారి సమావేశమయ్యేవారు. పొదుపులు, అప్పులు, రుణవాయిదాల చెల్లింపులపై చర్చలు జరిగేవి. రెండేళ్ల కిందటివరకు ఇదే పరిస్థితి. ఆరోగ్యంపై కూడా మహిళలను చైతన్యం చేయాలన్న లక్ష్యంతో నెలకోసారి నిర్వహిస్తున్న సమావేశానికి తోడు అదనంగా మరోటి నిర్వహించాలన్న నిబంధన తీసుకువచ్చారు. దీంతో సంఘాల సభ్యులు నెలలో రెండు సార్లు సమావేశం కావాల్సిందే. పర్యవేక్షణ లేక ఒక దానితోనే సరిపెడుతున్నారు.
ఏం చర్చించాలంటే?: ప్రతినెలా నిర్వహించే ద్వితీయ సమావేశంలో ఆరోగ్యమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. సంఘంలోని సభ్యులు, కుంటుంబీకుల ఆరోగ్యంపై చర్చించాలి. ఎవరికైనా సమస్యలుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. అవసరమైతే ఆరోగ్య సిబ్బందిని సమావేశానికి ఆహ్వానించి సలహాలు, సూచనలు అందేలా చూడాలి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పెరటి తోటల్లో కూరగాయలు పండించే విధానంపై వివరించాలి. హరితహారంలో భాగంగా పండ్ల మొక్కలు కూడా పెంచుకునేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. తద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన నాణ్యమైన కూరగాయలు, పండ్లు తీసుకునేందుకు వీలుంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఉండే ప్రయోజనాలపై సమావేశాల్లో వివరించాలి. కుటుంబాల్లో బాలింతలు, గర్భిణులు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం తదితర అంశాలపై అవగాహనకు ఈ సమావేశాలు వేదిక కావాల్సి ఉంటుంది.
ఏడాది కిందట అమలుపై సర్వే: సంఘాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సమావేశాల అమలు తీరుపై పేదరిక నిర్మూలన సంస్థ ఏడాది కిందట సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలో ఐదు మండలాలల్లో బృందాలు పర్యటించి సర్వే నిర్వహించాయి. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో సమావేశాల తీరును పరిశీలించారు. బృందం పర్యటన నేపథ్యంలో హడావుడి చేశారు. ఆ తర్వాత పర్యవేక్షించే వారు కరవయ్యారు.
సక్రమంగా జరిగేలా చూస్తాం: జంగారెడ్డి, అదనపు డీఆర్డీవో
మహిళా సంఘాల సభ్యులతోపాటు వారి కుటుంబాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే సమావేశాల లక్ష్యం. ఇవి సక్రమంగా జరిగేలా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశిస్తాం. సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే అందరూ చేయూతనందించాలి. సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన కోహ్లీ, అక్షర్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 177
-
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం