వాన లేక.. అన్నదాత ఆందోళన
వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది.
మొలకెత్తని విత్తనాలు
న్యూస్టుడే, నార్సింగి(చేగుంట): వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులను సమకూర్చుకున్నారు. చాలా మంది వరి నార్లు పోసుకున్నారు. మరి కొందరు పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలను వేసుకున్నారు. పది రోజులుగా తేలికపాటి వానలు కూడా కురవడంలేదు.
జిల్లా వ్యాప్తంగా 37,321 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారుల అంచనా. ఇప్పటివరకు 9,500 ఎకరాల్లో మాత్రమే సాగయింది. అందులో సగం కూడా మొలకెత్తలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. రేగోడ్, అల్లాదుర్గం, చేగుంట, నిజాంపేట, టేక్మాల్ తదితర మండలాల్లో తొలకరి వర్షాలకు పత్తి సాగు చేశారు. నీటి తడి అందక అవి మొలకెత్తడంలేదు. రూ.వేల పెట్టుబడులు పెట్టినా ఇదేం పరిస్థితని వాపోతున్నారు.
బోర్ల నుంచి అందిస్తూ..: మొక్కజొన్న 2,593 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 215 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. చేగుంట, నిజాంపేట, శివ్వంపేట మండలాల్లోనే విత్తనాలు వేశారు. ఇందులో సగం మొలకెత్తలేదు. చేగుంట మండలం బోరు నుంచి నీటి తడులు అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భూగర్భజలాలు కూడా తక్కువగా ఉండడంతో సరిగా అందడంలేదు. కందులు 945 ఎకరాల్లో వేయాల్సి ఉండగా, 100 ఎకరాల్లో వేశారు. అలాగే జొన్నలు 65 ఎకరాలకు కేవలం నాలుగు ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. జూన్లో సాధారణ వర్షపాతం 64.7 మిల్లీమీటర్లకు కురిసింది 86.1 మి.మీ. ఇది కూడా మొదటి వారంలోనే కురిసింది. దీంతో రైతులు పూర్తిస్థాయిలో విత్తనాలను వేసుకోలేని పరిస్థితి నెలకొంది. విత్తనాలు వేసిన చోట మొలకెత్తడంలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగుకు ఇబ్బందులు తప్పవని రైతులు పేర్కొంటున్నారు.
తగ్గిన భూగర్భజలాలు: వర్షం కురిస్తేనే వరినాట్లు వేసుకోవడం సాధ్యపడుతుంది. ప్రసుత్తం బోర్లలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేగుంట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట, మాసాయిపేట, నార్సింగి, హవేలిఘనపూర్, నర్సాపూర్, కొల్చారం తదితర మండలాల్లో బోరు బావులనే నమ్ముకొని వరి సాగు చేస్తుంటారు. ప్రస్తుతం బోర్లలో కూడా నీటి మట్టం తగ్గింది.
తేమ ఉంటేనే విత్తనాలు వేయాలి
-గోవింద్, డీఏవో
భూమిలో తేమ ఎక్కువగా ఉంటేనే విత్తనాలు వేసుకోవాలి. భారీ వర్షాలు కురిసిన తర్వాత నీరు భూమిలోకి వెళితే తేమశాతం పెరుగుతుంది. అప్పుడు విత్తితే సమస్య ఉండదు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. అందువల్ల విత్తనాలు వేయవద్దు.
మళ్లీ దున్నాల్సిందే
-మల్లయ్య, రైతు, బోనాల
ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న వేశా. రూ.5 వేలు ఖర్చయింది. విత్తనం మొలకెత్తకపోతే మళ్లీ దున్ని వేయాలి. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. తొలకరితో విత్తనాలు నాటాం. వర్షాలు కురిస్తేనే పంటలు పండే అవకాశం ఉంది.
బోర్లలో నీటి మట్టం తగ్గింది
-మధుసూదన్రెడ్డి కర్నాల్పల్లి
బోర్లలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. వర్షం వస్తుందని ఆకాశం వంక ప్రతి రోజు చూస్తున్నాం. నీరు లేకపోతే వరి సాగు కష్టం. ఇంకా నారుమళ్లు పోయలేదు. ఎకరన్నర విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుచేశా. కొద్దిగా మొలకెత్తినా ఎండవేడికి మాడిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు