అర్జీల స్వీకరణ.. సవరణకు కార్యాచరణ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
న్యూస్టుడే, పెద్దశంకరంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జవనరిలో గ్రామసభలు ఏర్పాటు చేసి అని గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ పంపిణీ ప్రారంభించారు. అయితే దరఖాస్తుల్లో లోపాల వల్ల విద్యుత్ జీరోబిల్లు, మరికొందరికి వంటగ్యాస్ రాయితీ అందకుండా పోయింది. దీంతో ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తుల్లో సవరణల ప్రక్రియ చేపట్టారు. అంతలోనే లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో నిలిపివేశారు. మూడు నెలల తర్వాత తిరిగి చేపట్టారు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
అర్హులకు అవకాశం: గృహజ్యోతి అర్హుల్లో కొందరికి విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. ప్రభుత్వం ఆహారభద్రతకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని ప్రకటించింది. కాని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అందరికీ లబ్ధి చేకూరడం లేదు. ఇక రూ.500 గ్యాస్ పథకానికి సంబంధించిన నగదు అందరి ఖాతాల్లో జమ కావడం లేదు. ప్రజాపాలన గ్రామసభల సమయంలో దరఖాస్తులు ఆన్లైన్ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో కంప్యూటర్ ఆపరేటర్లు సరిపోక ప్రైవేటు వ్యక్తులకు, ఎవరికి పడితే వారికి అప్లోడ్ బాధ్యతను అప్పగించారు. వారు ఇష్టారాజ్యంగా చేయడంతో అనేక మందికి పథకాలు అందకుండా పోయాయి. సవరణ చేయించుకుందామంటే మూడు నెలల పాటు లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా సైట్ మూసి ఉంచారు. ప్రజాపాలనతో దరఖాస్తు చేసిన చాలా మంది అర్హులకు మొండిచేయి ఎదురవుతోంది. ప్రస్తుతం మళ్లీ సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అర్హులైన లబ్ధిదారులు ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్లి వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. వీటికి వెంటనే ఆమోదం లభిస్తుండడంతో లబ్ధిదారులకు ఊరట లభిస్తోంది. అయితే ఆపరేటర్లు చేసిన తప్పుల కారణంగా చాలా మందికి పథకాలు అందడం లేదు. దరఖాస్తు చేసుకున్నా మూడు, నాలుగు పథకాలకే దరఖాస్తు చేసినట్లు కొందరివి పొందుపరిచారు. దీంతో మిగతా పథకాలకు నాట్ అప్లయ్ అని వస్తుంది. ఇలా నాట్ అప్లయ్ అని వచ్చే పథకాలకు సంబంధించి ఆప్షన్ తెరిచేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. సవరణలతో పాటు కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
-
దంచికొట్టిన కోహ్లీ, అక్షర్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 177
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం