కొనుగోళ్లు ముగిశాయి.. పైసలు అందాయి..
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు.
3.15 లక్షల టన్నుల ధాన్యానికి రూ.691 కోట్ల చెల్లింపు
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యం కన్నా తక్కువ ధాన్యం కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో ధాన్యం దిగుబడులు తగ్గడం, అంచనాకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలకు రాకపోవడమే కారణమని తెలుస్తోంది.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను 210 ఐకేపీ, 6 మెప్మా, 202 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొన్నారు. గతంలో సంఘటనలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు సహా పౌరసరఫరాలు, రెవెన్యూ, ఐకేపీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. కొన్న వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు.
గతేడాది కంటే తగ్గింది
గత ఏడాది యాసంగి సీజన్తో పోల్చితే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. వానాకాలం సీజన్తో పోల్చితే మాత్రం పెరిగాయి. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. గింజకు పాలు పోసుకునే దశలో చాలా చోట్ల వరి పొలాలు ఎండిపోయాయి. దిగుబడులు పడిపోయాయి. గత ఏడాది యాసంగి సీజన్తో పోల్చితే ఈ ఏడాది 54,205 టన్నుల ధాన్యం కొనుగోలు తగ్గింది. వానాకాలం సీజన్తో పోల్చితే 6,100 టన్నులు పెరిగింది. గత ఏడాది వానకాలంలో 3.09 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు.
విక్రయించిన మూడు రోజులకే చెల్లించాం
-హరీశ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.691 కోట్లు జమ చేశాం. డబ్బుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ట్యాబ్లో నమోదు చేశారు. విక్రయించిన మూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నాం. ఇంకా సుమారు రూ.1 కోటి వరకు జమ చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే చెల్లిస్తాం. అందరి సహకారంతో కొనుగోళ్లు విజయవంతమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు