కేజీబీవీల్లో ప్రవేశాల జోరు
నాణ్యమైన విద్య.. చక్కటి వసతి.. అనుబంధంగా వృత్తి విద్యా కోర్సులు.. అర్హత కలిగిన బోధనా సిబ్బందితో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) కొనసాగుతున్నాయి.
పాఠశాల స్థాయిలో లక్ష్యాన్ని మించి చేరిక
న్యూస్టుడే, సిద్దిపేట: నాణ్యమైన విద్య.. చక్కటి వసతి.. అనుబంధంగా వృత్తి విద్యా కోర్సులు.. అర్హత కలిగిన బోధనా సిబ్బందితో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) కొనసాగుతున్నాయి. ఏటా వాటిల్లో చేరేందుకు విద్యార్థినులు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 12న విద్యా సంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియ ముమ్మరంగా సాగింది. పాఠశాలల్లో లక్ష్యాన్ని మించి చేరారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త కేజీబీవీలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ధూల్మిట్టకు నూతనంగా మంజూరైన కేజీబీవీని తాత్కాలికంగా కొమురవెల్లిలోని అదే విద్యాలయం రెండో అంతస్తులో అందుబాటులోకి తెచ్చారు. ఒకేచోట రెండు విద్యాలయాలను నిర్వహిస్తున్నారు.
కళాశాలల్లో గతం కంటే ఎక్కువ
జిల్లాలో కేజీబీవీల్లో పాఠశాల స్థాయిలో 23, కళాశాల స్థాయిలో (ఇంటర్) ఏడు కొనసాగుతున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం 3842 మంది, కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 555 మంది చదివారు. గత ఫలితాల్లో పదో తరగతిలో 99.7 శాతం, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 85.7 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 242 మంది బోధనా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యను అందిస్తూ.. వసతి సదుపాయం కల్పిస్తుండటంతో ఎక్కువ శాతం బాలికలు మొగ్గు చూపుతున్నారు. రాత్రివేళల్లో ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రక్షణ దిశగా ఏఎన్ఎం అందుబాటులో ఉంటున్నారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కరాటేలో తర్ఫీదు అందిస్తున్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలికలు సత్తా చాటుతున్నారు. ఇంటర్ విద్యార్థినులకు ఎప్సెట్, లాసెట్, నీట్ సంబంధిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. జీవన నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. జిల్లాలోని మిట్టపల్లి, మిరుదొడ్డిలోని కేజీబీవీలలో రెండు చొప్పున వృత్తి నైపుణ్య కోర్సులు నిర్వహిస్తున్నారు.
మూడు చోట్ల అద్దె భవనాలు
ప్రస్తుతం ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన తరగతుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ధూల్మిట్ట కేజీబీవీలో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో తరగతిలో 40 మందికి అవకాశం ఇవ్వనున్నారు. ఏడు చోట్ల కళాశాల స్థాయిలో రెండు చొప్పున కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో ఒక్కో కోర్సులో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో రాయపోల్, అక్కన్నపేట, ధూల్మిట్ట మినహా అన్ని సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. ‘న్యూస్టుడే’తో విద్యా శాఖ జెండర్ అండ్ ఈక్విటీ సమన్వయకర్త (జీఈసీవో) ముక్తేశ్వరి మాట్లాడుతూ.. అన్ని వసతులతో కొనసాగుతున్నాయని.. నెలకు రూ.100 చొప్పున ఒక్కో విద్యార్థినికి స్టైపండ్ అందిస్తున్నామని చెప్పారు. డిజిటల్ తరగతులు ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు
[ 29-06-2024]
తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
స్వయం ఉపాధితో చక్కటి భవిత
[ 29-06-2024]
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
సిలిండర్ రాయితీకి ఎదురుచూపులు
[ 29-06-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. -
ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో
[ 29-06-2024]
పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. -
సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం
[ 29-06-2024]
ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. -
బోధనలో వినూత్నం
[ 29-06-2024]
బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. -
సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి
[ 29-06-2024]
పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. -
ఉద్యాన పంటకు బిందు రాయితీ
[ 29-06-2024]
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. -
పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం
[ 29-06-2024]
ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్లైన్ తాఖీదులను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలి. -
కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం
[ 29-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. -
ఫోన్ పోతే దొరుకునులే..
[ 29-06-2024]
నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. -
బడుగులపై పిడుగు
[ 29-06-2024]
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. -
చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం
[ 29-06-2024]
చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. -
వీధి వ్యాపారులకు భరోసా
[ 29-06-2024]
పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు