logo

Mahbubnagar: మార్కెట్ యార్డును అప్ గ్రేడ్ చెయ్యాలి

అయిజ మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సమస్యలు పరిష్కరించి అప్ గ్రేడ్ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా భాజపా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు.

Updated : 02 Jul 2024 16:40 IST

రాజోలి: అయిజ మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సమస్యలు పరిష్కరించి అప్ గ్రేడ్ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా భాజపా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన, పార్టీ నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్‌ను పరిశీలించారు. ఐజ పట్టణంతో పాటు 32 గ్రామాల ప్రజలు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో, కూరగాయలను వేలంపాట నిర్వహిస్తారు. వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. తాగునీటి సౌకర్యము, మరుగుదొడ్లు అందుబాటులో లేవని, మార్కెట్ మొత్తం ముళ్ళకంపతో పెరిగి వాటిలో నుంచి విష సర్పాల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అయిజ పట్టణ, మండల అధ్యక్షుడు నరసింహ శెట్టి, గోపాలకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి భగత్ రెడ్డి, మేడికొండ భీమ్ సేన తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు