logo

Mahbubnagar: పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్ష సమావేశం

గద్వాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జిల్లాలోని పోలీస్ ఛానల్లో పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated : 25 Jun 2024 19:43 IST

రాజోలి: గద్వాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జిల్లాలోని పోలీస్ ఛానల్లో పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సిఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఉమెన్ మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి చేధించాలన్నారు. ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరగా విచారించి చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె.గుణ శేఖర్, డి.ఎస్పీ సత్యనారాయణ,  సీఐలు బీమ్ కుమార్, రవి బాబు, రత్నం తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని