logo

Mahbubnagar:: సామాజిక బాధ్యత సేవా బృందం చేయూత

గద్వాల పట్టణానికి చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ బృందం సభ్యులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు మంగళవారం రూ.42 వేల ఆర్థిక సాయం అందజేశారు.

Updated : 11 Jun 2024 19:13 IST

రాజోలి: గద్వాల పట్టణానికి చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ బృందం సభ్యులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు మంగళవారం రూ.42 వేల ఆర్థిక సాయం అందజేశారు. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన సుచరిత(41) తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం కోసం డబ్బు అందక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ బృందం సభ్యులు, గ్రామానికి వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. అనంతరం ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని