logo

Mahbubnagar: పాఠశాలలు ప్రారంభం

వేసవి సెలవుల తర్వాత బుధవారం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.

Published : 12 Jun 2024 15:31 IST

రాజోలి: వేసవి సెలవుల తర్వాత బుధవారం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ముళ్లదిన్నె ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులను లోపలకు ఆహ్వానించారు. వచ్చిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. తొలి రోజు విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని పాఠశాల హెచ్ఎంలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు