logo

Mahbubnagar: కస్తూర్బాను ఏర్పాటు చేయాలని వినతి

వడ్డేపల్లిలో నిర్వహిస్తున్న రాజోలి కస్తూర్బా పాఠశాలలో బాలికలు తీవ్ర ఇబ్బందుల మధ్య చదువులు కొనసాగిస్తున్నారని, ఆ పాఠశాలను మండల కేంద్రానికి మార్చాలని తల్లిదండ్రులు మంగళవారం ఎంపీడీవో రమేశ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated : 25 Jun 2024 17:33 IST

రాజోలి: వడ్డేపల్లిలో నిర్వహిస్తున్న రాజోలి కస్తూర్బా పాఠశాలలో బాలికలు తీవ్ర ఇబ్బందుల మధ్య చదువులు కొనసాగిస్తున్నారని, ఆ పాఠశాలను మండల కేంద్రానికి మార్చాలని తల్లిదండ్రులు మంగళవారం ఎంపీడీవో రమేశ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కస్తూర్బా కోసం మంజూరైన భవనం ఏడేళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో 220 మందికి పైగా విద్యార్థులు మూడు తరగతి గదుల్లో చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం రాజోలిలోనే తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పాఠశాలను తరలించాలని వారు కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని