logo

Rajoli: ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు

మానవపాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు.

Published : 04 Jul 2024 19:37 IST

రాజోలి: మానవపాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు శాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని