logo

Telugu news:: ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌

అలంపూర్ నియోజకవర్గం రాజోలి, మానవపాడు మండలంలో జడ్పీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గురువారం జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత ప్రారంభించారు.

Published : 04 Jul 2024 19:36 IST

రాజోలి: అలంపూర్ నియోజకవర్గం రాజోలి, మానవపాడు మండలంలో జడ్పీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గురువారం జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత ప్రారంభించారు. ముండ్లదిన్నె గ్రామంలో రూ. 13.75 లక్షలతో నిర్మించిన జిల్లా అంగన్వాడీ  కేంద్ర  భవనాన్ని, మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 20 లక్షలతో  నిర్మించిన అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుగుణమ్మ, ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని