logo

Rajoli: సమస్యలు పరిష్కరించాలి

అయిజ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు.

Published : 13 Jun 2024 16:58 IST

రాజోలి: అయిజ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. బాలికల వసతి గృహంలో పై కప్పు  పెచ్చులు ఊడి పడిపోయాయని,  సమయానికి విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు భీమ్ సేన్ రావు, వీరయ్య చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు