పర్యాటక శోభ ఒనగూరేనా..!
పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది.
నేడు, రేపు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు నల్లమలలో పర్యటన
కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన బోటు
ఈనాడు, మహబూబ్నగర్: పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది. అయినా పూర్తిస్థాయిలో పర్యటక రంగం అభివృద్ధి పట్టాలు ఎక్కలేదు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరును పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, అటవీ, పర్యాటక శాఖ అధికారులు నేడు, రేపు నల్లమలలో పర్యటించనున్నారు. ప్రకృతి, చారిత్రక, వారసత్వ, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉన్న పూర్వ మహబూబ్నగర్ జిల్లా పర్యటక శోభను సంతరించుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధించనుంది. ఇప్పటికే నల్లమలలో ఏకో టూరిజం అభివృద్ధిలో భాగంగా రూ.91.62 కోట్లతో పనులు జరిగాయి.
నల్లమలలోని వ్యూ పాయింట్
అభిరుచికి అనుగుణంగా..: కొందరికి ప్రకృతి అంటే ఇష్టం. మరికొందరికి ఆధ్యాత్మిక అంటే ఆసక్తి చూపుతారు. వీరికోసం ఏకో, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నల్లమల ప్రాంతాన్ని ఏకో టూరిజంగా గతంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. సోమశిల నుంచి కృష్ణానదిలో ఈగలపెంట లాంచీని ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి పాతాళగంగ, శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకునేలా గతంలో పర్యటకశాఖ ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేసింది. దీనిలో భాగంగా పర్హాబాద్ వ్యూ పాయింట్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం చూసేలా ప్యాకేజీలను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. కొన్ని రోజులు వారాంతాల్లో ఈ ప్యాకేజీలు నడిచాయి. సోమశిల నుంచి శ్రీశైలానికి సాగే ప్రయాణంలో ప్రకృతి, ఆధ్యాత్మికం టూరిజం ఒకేసారి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.
వీటిపై దృష్టి సారిస్తే..
- నల్లమలలోని టూరిజం కాటేజీలు, భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడంతో ఇష్టారాజ్యంగా అద్దెలు వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో వచ్చే పర్యాటకులు అద్దె ఖర్చులు భరించలేక అవస్థలు పడుతున్నారు. టూరిజం భవనాలను ప్రభుత్వమే నిర్వహిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది.
- నల్లమలలో ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారు. శ్రీశైలం రహదారి వెంట అటవీ ప్రాంతాల్లో గుట్టలను తవ్వి ప్రైవేటు వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు.
- కృష్ణానదిలో సోమశిల-శ్రీశైలం ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసినా సరిగా అమలు కావడం లేదు. వివిధ కారణాలతో ఈ బోట్లను నడపడం లేదు. విధిగా శ్రీశైలం వరకు నది ప్రయాణం జరిగేలా దృష్టి సారించాలి.
- నల్లమలలో ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రకృతి, ఆధ్యాత్మికత మేళవింపుగా..
పాలమూరును పర్యాటక హబ్గా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రెండురోజులు నల్లమలలో పర్యటించి అధ్యయనం చేయనున్నారు. అభయారణ్యంలోని వ్యూ పాయింట్, మల్లెలతీర్థం, అక్టోపస్, వజ్రాల మడుగు, అక్కమాంబ ఆలయం, కదళివనం, రాయలగండి, ప్రతాపరుద్రుని కోట, మన్ననూరు జంగిల్ రిసార్ట్తోపాటు కృష్ణలో రివర్ బోటింగ్, మద్దిమడుగు అంజనేయస్వామి ఆలయం సందర్శన వంటివి చేర్చారు. ఈ అధ్యయనం ప్రకృతి, ఆధ్యాత్మిక మేళవింపుగా సాగనుంది. పర్యాటక రంగ అభివృద్ధితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా ఈ బృందం దృష్టి సారించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం