logo

బడికి వెళ్లిన బాల వధువు

బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన గండీడ్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప ఆరో తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు.

Updated : 05 Jul 2024 06:17 IST

ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారంతో వరుడిపై పోక్సో కేసు

గండీడ్, న్యూస్‌టుడే : బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన గండీడ్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప ఆరో తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. గత నెలలో పాఠశాలలు ప్రారంభం కాగా వారం క్రితం బాలిక తరగతులకు హాజరయ్యేందుకు వెళ్లింది. ఆమెకు వివాహమైనట్లు గుర్తించిన ఉపాధ్యాయులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు విచారణ చేపట్టారు. ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారిణి రాధిక ఫిర్యాదు మేరకు బాలికను స్టేట్‌ హోంకు తరలించి వివాహం చేసుకున్న యువకుడితో పాటు సహకరించిన కుటుంబ సభ్యులపై ఛైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని