పాలమూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తా
కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు.
లోక్సభ సభ్యురాలు డీకే అరుణ
అభినందన సభలో ఎంపీ డీకే అరుణను గజమాలతో సత్కరిస్తున్న భాజపా నాయకులు
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీగా గెలుపొందాక మొదటిసారిగా గురువారం మహబూబ్నగర్ వచ్చిన డీకే అరుణను స్థానిక భాజపా నేతలు అన్నపూర్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాయని, ఇక రాజకీయ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కోసం తాను పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగని భాజపా నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు భారాస నేతల్లాగే వ్యవహరిస్తున్నారని, పార్టీలు మారాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని, ఇకనైనా మానుకోకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను ఓడించడానికి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, వ్యక్తిగతంగా తనను, తన కుటుంబాన్ని దూషించినా, చివరకు సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు జిల్లాకు వచ్చి సర్వశక్తులు ఒడ్డినా ఆడబిడ్డగా ఆదరించి గెలిపించారన్నారు. అనేక ఒత్తిళ్లు, అవమానాలను ఎదుర్కొని తన గెలుపునకు క్షేత్రస్థాయిలో పనిచేసిన భాజపా నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అంతుకుముందు డీకే అరుణకు అప్పన్నపల్లి రైల్వే వంతెన నుంచి అన్నపూర్ణ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్రెడ్డి, భాజపా సీనయర్ నేతలు నాగూరావు నామాజీ, శ్రీవర్ధన్రెడ్డి, పద్మజారెడ్డి, కొండయ్య, ఎగ్గని నర్సింహులు, బాలరాజు, వీరబ్రహ్మాచారి, సుదర్శన్రెడ్డి, జయశ్రీ, సాహితీరెడ్డి, భాజపా మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235
-
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్
-
మద్యం సేవించి.. దంపతులను కారుతో ఢీ కొట్టి!
-
ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
-
జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!