గోదాములు దూరం.. రైతుకు భారం
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్ పాయింట్లు (గూడ్స్ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.
నారాయణపేట ప్రాంతంలో వరి సాగు (పాతచిత్రం)
న్యూస్టుడే-నారాయణపేట న్యూటౌన్, హన్వాడ : ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్ పాయింట్లు (గూడ్స్ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. పాలమూరు ఐదు జిల్లాలుగా మారి ఐదేళ్లు అయినా నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల వ్యాపారులు పాత రేక్పాయింట్పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ప్రాజెక్టులు, కాల్వలు లేకపోవడంతో వర్షాధారం పంటలే దిక్కు. వీటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు రేక్ పాయింట్ కేంద్రం నుంచి వ్యాపారులు తీసుకొస్తూ విక్రయిస్తున్నారు. పాత జిల్లాలో పాయింట్ కొత్తూరులో ఉండేది. అక్కడ గోదాములతో పాటు రోడ్డు, రైలు మార్గాలకు అనువుగా ఉండటంతో వ్యాపారులకు సులువుగా ఉండేది. తర్వాత జడ్చర్ల, గద్వాల పట్టణాల్లోనూ రేక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోడ్డుతో పాటు, రైల్వే మార్గాలను కలిగిన నారాయణపేట, నాగర్కర్నూల్లో మాత్రం ఇంత వరకు ఏర్పాటు చేయలేదు.
ఏటా కోట్ల అదనపు భారం
రేక్ పాయింట్ లేని మూలంగా ఈ జిల్లాల్లోని రైతులకు ఏటా రూ. కోట్ల అదనపు భారం పడుతుందని ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలను బట్టి తెలుస్తుంది. స్థానికంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారస్థులు సైతం రేక్ పాయింట్ నుంచే వాటిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న రేక్ పాయింట్లు నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని మండలాలకు దూరం కావడంతో రవాణా భారాన్ని రైతులపై మోపి ధరలు నిర్ణయిస్తూ అమ్ముతున్నారు. దీంతో ఎరువులపై ధర ఎక్కువ పడుతుంది. ఇక్కడ కొనకుండా రేక్ పాయింట్ వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఎరువులు, విత్తనాలు లభిస్తాయన్న ఉద్దేశంతో రవాణా ఖర్చులను సైతం లెక్క చేయకుండా రేక్ పాయింట్ కేంద్రాలయిన జడ్చర్ల, గద్వాలల నుంచి తెచ్చుకుంటున్న మిగతా వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా ప్రభుత్వం ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు ఎరువులపై రవాణా ఛార్జీలను ఇవ్వటం లేదు. దాంతో వారు ఎరువులపై రేట్లను పెంచి అమ్మటంతో రైతులపై భారం పడుతోంది. మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్(హకా), డీసీఎంఎస్ వంటి సంస్థలకు రవాణా సదుపాయం కింద ప్రభుత్వం ఛార్జీలు చెల్లించేది. ఇప్పుడు ఇవ్వడం లేదు.
గోదాములు నిర్మించాలి
ఉమ్మడి జిల్లాలో రైల్వే మార్గం అభివృద్ధి చెందింది. అలంపూర్, వనపర్తిగేట్, మరికల్, మక్తల్, మాగనూర్, కృష్ణా రైల్వే లైను ఉంది. ఇటు బాలనగర్, మహబూబ్నగర్లకు కూడా రైల్వే సదుపాయం ఉంది. ఇక్కడ మరిన్ని గోదాములు నిర్మిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోదాములను నిర్మించి రేక్ పాయింట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు పరంగా రూ. కోట్లు ఆదా కల్పించినట్లు అవుతుంది.
ప్రతిపాదనలు పంపించాం
జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గోదాములు మంజూరైతే విత్తనాలు, ఎరువులు ఉత్పత్తి అయిన చోటు నుంచి నేరుగా పాయింట్ వద్దకు వస్తాయి. దీని వల్ల జిల్లా వ్యవసాయ శాఖకు రవాణా భారం తగ్గనుంది. రైతులకు తక్కువ ధరకు లభిస్తాయి.
జాన్ సుధాకర్, డీఏవో, నారాయణపేట, నరసింహరావు, మార్క్ఫెడ్ ఎండీ, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు