ప్రాజెక్టుల పెండింగ్ పనులపై నివేదికలివ్వండి
పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ
నాగర్కర్నూల్, న్యూస్టుడే: పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలతో కలిసి గురువారం సమీక్షించారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి సమావేశం ఉంటుందని, దానిని ముందస్థుగా మంత్రులు ఈ సమావేశం నిర్వహించి అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏయే ప్రాజెక్టు కింద ఎంత వరకు పనులు పెండింగ్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాలవారీగా ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, సంగంబండ, జురాల, తుమ్మిళ్ల, ఆర్డీఈఎస్, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనుల్ని వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో ప్రతి నియోజకవర్గంలో నాలుగు, ఐదు టీఎంసీల జలాశయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రులు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండు టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలన్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత పనులు, పిచ్చి మొక్కల తొలగింపును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. జూరాల నుంచి కోయిలకొండ వరకు 20 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు పరిశీలన చేసి ప్రతిపాదనలు తయారు చేయించాలని ఎమ్మెల్యేలు మంత్రులను కోరారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, పర్నికరెడ్డి, శంకర్, శ్రీహరి, మేఘారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీలు అనిల్కుమార్, నాగేంద్రరావు, సీఈలు విజయభాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు