ఎస్సీ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు
ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
59 తరగతుల్లో చేరేందుకు అవకాశం
ఈ నెల 12 తుది గడువు
గురుకుల ప్రవేశ పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలిస్తున్న
మహబూబ్నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత (పాతచిత్రం)
అచ్చంపేట, న్యూస్టుడే: ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఐదో తరగతిలో చేరేందుకు అవకాశం కల్పించారు. ఇంకా మిగులు సీట్లు ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ గురుకులాల్లో 5-9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అధికారులు ప్రకటన జారీ చేశారు. గత నెల 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తరువాత పరిశీలించి అర్హులైన విద్యార్థులతో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వీరు అర్హులు
- గతంలో పరీక్షకు హాజరై సీటు వచ్చినా కేటాయించిన గురుకుల పాఠశాలలో చేరని విద్యార్థులు
- పరీక్ష రాసి సీటు పొందని వారు
- అనాథలు
- దివ్యాంగులు
- పరీక్షకు హాజరు కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
దరఖాస్తు విధానం
ఎస్సీ గురుకులం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పూర్తి వివరాలను అందులో నమోదు చేయాలి. ఆన్లైన్లో మొదట రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తులో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, ఫొటో, చరవాణి నంబరు, విద్యార్థి సంతకం స్కాన్ చేసి దరఖాస్తుకు జతచేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలల్లో ఆయా తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులు ఈ నెల 12లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకులాల మహబూబ్నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 5-9 తరగతి వరకు అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా బాల, బాలికలకు సీట్లు కేటాయిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!