అనుమతిలేని వ్యాపారం.. అన్నదాతకు నష్టం
అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి.
విచ్చలవిడిగా బయో మందుల విక్రయాలు
- అయిజ మండలంలో రైతులు పత్తి పంటపై పూత పిందె రావటం కోసం రూ.లక్షలు వెచ్చించి బయో మందులు వాడారు. అయినా ఫలితం లేకపోవడంతో పంటనే పీకేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సదరు రైతులు దీంతో కోలుకోలేని పరిస్థితిలోకెళ్లిపోయారు.
- తాడూరు మండలంలో గతేడాది ఓ రైతు ఎన్ని మందులు కొట్టినా దిగుబడి రాక చివరి ప్రాణాలే తీసుకున్నాడు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలా నష్టపోయిన రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలోనే ఉంటున్నారు. వారిలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే విన్పిస్తాయి.
గద్వాల, అయిజ, న్యూస్టుడే: అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి. వాటిని తీసుకెళ్లి పంటపై పిచికారీ చేసిన రైతుకు ఫలితం రాకుంటే పంట నాశనం అయి చీకట్లు నింపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అనుమతి ఉన్న రసాయనిక మందుల కంటే అనుమతి లేని బయో మందుల విక్రయాలే ఎక్కవగా ఉంటున్నాయన్నది వ్యవసాయశాఖ అధికారులెరిగిన సత్యం.
వరుసకడుతున్న కంపెనీలు: వానాకాలం సీజన్ మొదలు కావటంతో సాధారణ, విత్తన పత్తి పంటల సాగును రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మిరప, ఇతర వాణిజ్య పంటలను ఆగస్టులో సాగు చేయనున్నారు. ఈ పంటలకు బయో మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంపెనీలు జిల్లాలోని డీలర్ల వద్దకు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలోని హైదరాబాద్, ఆంధ్రాలోని గుంటూరు, కర్నూలు కేంద్రాలుగా ఉన్న బయో కంపెనీలు వీటిని ఎక్కువగా తయారు చేస్తున్నాయి. ఏటా సీజన్లో ఉమ్మడి జిల్లాలో రసాయనిక మందుల వ్యాపారం రూ.225 కోట్ల వరకు నడుస్తోంది. అందులో సగం బయో మందుల విక్రయాలే ఉంటాయన్నది వ్యవసాయ అధికారులకు సైతం తెలిసిన విషయమే.
అదనపు బహుమతులెన్నో..: ఉమ్మడి జిల్లాలో 2,800 వరకు పురుగు మందుల విక్రయ దుకాణాలున్నాయి. బయో మందులు విక్రయాల కోసం కంపెనీలు సీజన్ మొదట్లోనే డీలర్లను సంప్రదించి వారికి ఎంత స్టాకు అమ్మితే ఏయే బహుమతులు ఇచ్చేది, ఎక్కడెక్కడకు విహార యాత్రలకు తీసుకెళ్లెది చెప్పి డీలర్లకు చేరవేస్తుంటాయి. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు పెరగడంతో వీటి విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది కేవలం రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు బయో మందులను విక్రయించిన గద్వాల ప్రాంతానికి చెందిన డీలర్లకు బంపర్ ఆఫర్ కింద విహార యాత్రకు గోవా, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అత్యధికంగా వ్యాపారం చేసే డీలర్లను ఇతర దేశాలకు సైతం విహారయాత్రలకు తీసుకెళ్తున్నాయి.
అత్యధిక ఎమ్మార్పీ..: బయో మందుల ప్రభావం పంటలపై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో వీటిని మళ్లీ మళ్లీ పిచికారీ చేయాల్సి ఉంటోంది. ఇది రైతుకు ఆర్థిక భారం. ధరలు కూడా అధికంగానే ఉంటాయి. పత్తిలో తెల్లదోమ నివారణకు వినియోగించే ఓ మందు ఎమ్మార్పీ రూ.3,570 ఉంటే మార్కెట్లో రూ.1,900కు లభిస్తోంది. రూ.వందల్లో తయారయ్యే మందులు రూ.వేలలో ఎమ్మార్పీ పెడుతున్న ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. దీంతో కంపెనీల మార్కెట్ మాయాజాలం రైతుకు తెలియడంలేదు. రూ.300 బయో మందులకు రూ.1000 నుంచి రూ.2500 వరకు ఎమ్మార్పీ ముద్రించి విక్రయిస్తున్నారంటే రైతును ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
చర్యలు తీసుకుంటాం
రైతులు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, నిరూపణ అయితే డీలర్ల విక్రయ లైసెన్స్లు కూడా రద్దు చేస్తామని జోగులాంబ జిల్లా వ్యవసాయాధికారి గోవిందునాయక్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం