టిప్పర్ కింద పడి యువకుడి మృతి
టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
నర్సిరెడ్డి
నారాయణపేట(పాతబస్టాండ్), న్యూస్టుడే : టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండోకుమార్తె భీమమ్మ నారాయణపేట మున్సిపాలిటీలో అటెండర్గా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త నర్సిరెడ్డి ప్రతిరోజూ అంధురాలైన భీమమ్మను మక్తల్కు తీసుకువెళ్లేవాడు. పేటలోని హాజిఖాన్పేటలో మూడేళ్ల కిందట ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వ్యక్తిగత పనిపై పాతబస్టాండ్ చౌరస్తాకు వస్తున్న సమయంలో మొరం లోడ్తో వస్తున్న టిప్పర్ కింద పడి నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అంధురాలైన భీమమ్మ బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ దంపతులకు రెండేళ్ల ఆడపిల్ల ఉంది. కుటుంబీకులు వచ్చాక కేసు నమోదు చేస్తామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
భర్త మరణవార్త తెలిసి బోరున విలపిస్తున్న అంధురాలైన భీమమ్మ
గతంలోనూ... ఉమ్మడి జిల్లాలో టిప్పర్ కిందపడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులు మాత్రం యజమానులపై ఏ మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. మూడేళ్ల కిందట నారాయణపేట మండలం భైరంకొండలో సాయినాథ్ అనే యువకుడు టిప్పర్ కిందపడి మృతి చెందాడు. అప్పట్లో టిప్పర్ యజమాని బెదిరింపులపై పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో రాజీ జరిగింది. అదే టిప్పర్ గురువారం మరోమారు నిండు ప్రాణాన్ని బలితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.