పట్టుదలతో చదివారు.. ఫలితంతో మెరిశారు
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు.
ఎంఏవోలుగా ఎంపికైన పలువురు వ్యవసాయ కళాశాల విద్యార్థులు
బిజినేపల్లి, న్యూస్టుడే: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. 2024 జనవరిలో గుజరాత్లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు కార్యక్రమానికి పాలెం కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. జూన్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఏజీబీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు పసిడి పతకాలు సాధించారు. 2017-21 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేసిన మెహరాజ్ బేగం, మహేశ్వరిలు జూన్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. తాజాగా టీజీపీఎస్సీ నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి ఫలితాలలో పాలెం కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు గెజిటెడ్ అధికారులుగా ఉద్యోగాలు సాధించి కళాశాలకు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల మనోభావాలు ఇలా.
రైతు ఆదాయం పెంచేలా కృషి
మాది నల్గొండ జిల్లా చిన్న అడిశర్లపల్లి గ్రామం. 2016-20 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశా. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి పరీక్షలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 29వ ర్యాంకు సాధించా. నా విజయానికి కళాశాల అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో తోడ్పడ్డారు. కళాశాలలో అందించిన నాణ్యమైన విద్యా బోధనతో ఉద్యోగం సాధించే మార్గం సులభమైంది. ఎంఏవోగా రైతులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తూ, వారి ఆదాయం పెంచేలా కృషి చేస్తా.
యాదగిరి యాదవ్, పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి.
అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది
నాపేరు మణిదీపిక, మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చేర్వాల గ్రామం. పాలెం వ్యవసాయ కళాశాలలో 2016-20 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశాను. మండల వ్యవసాయాధికారి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఏకాగ్రతతో పరీక్షకు సిద్ధమయ్యా. సబ్జెక్టులో వచ్చిన సందేహాలను కళాశాల అధ్యాపకుల ద్వారా నివృత్తి చేసుకున్నా. దీంతో వ్యవసాయాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. రైతులకు ప్రభుత్వ రాయితీలు, సందేహాలను నివృత్తి చేస్తా.
మణిదీపిక, పాలెం కళాశాల విద్యార్థిని
రైతులకు విలువైన సమాచారం
మాది నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చిత్తనూరు గ్రామం. వ్యవసాయ కుటుంబం. రైతు కష్టాలు తెలిసిన నాకు వ్యవసాయ అధికారి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకు 2018-22 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశా. ఇటీవల వెలువడిన మండల వ్యవసాయాధికారి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం సాధించా. రైతులకు విలువైన సలహాలు, సూచనలు అందించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా.
అఖిలరెడ్డి, పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థిని
పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటు
మాది నారాయణపేట జిల్లా ఊట్కూరు గ్రామం. తల్లిదండ్రులు గొర్రెల కాపరులు. 2017-21 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశా. కళాశాలలో సెమిస్టర్ ఫీజులు కూడా చెల్లించే ఆర్థిక పరిస్థితి ఉండేది కాదు. దీంతో కళాశాల అధ్యాపకులే సెమిస్టర్ ఫీజులు చెల్లించారు. దీంతో ఏజీబీఎస్సీ పూర్తి చేయగలిగాను. మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధులు నిర్వర్తిస్తూ పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటునందిస్తా.
పొలప్ప, పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం