ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని నిరసనలు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి(భారాస)ని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.
గద్వాలలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
గద్వాల గ్రామీణం, న్యూస్టుడే: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి(భారాస)ని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. ఓ యువకుడు సెల్ఫోన్ టవర్ ఎక్కి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ధర్నాలో భాగంగా ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో కొన్నిరోజులుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావుతో హైదరాబాద్, కర్నూలు కేంద్రాలుగా ఎమ్మెల్యేతో చర్చలు జరిపారని.. అమావాస్య తరువాత చేరిక ముహూర్తం ఖరారయ్యిందనే విషయం తెలియడంతో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున గద్వాలలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాతబస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా బొంబాయి ప్రసాద్ అనే కార్యకర్త సరిత నివాసం సమీపంలోని సెల్టవర్ ఎక్కాడు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పట్టణ ఎస్సై శ్రీనివాస్తో పాటు డీఎస్పీ సత్యనారాయణ అక్కడికి వచ్చి కిందకు దిగి రావాలని మైకులో కోరారు. అయినా అతను దిగిరాలేదు. పోలీసు బందోబస్తు పెంచి ఫైరింజన్ రప్పించినా లాభం లేకపోయింది. చివరికి కొందరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానం తమకు న్యాయం చేస్తుందని కిందకు దిగిరావాలని కోరడంతో దిగివచ్చాడు.
టవర్ ఎక్కిన కాంగ్రెస్ కార్యకర్త
ఆత్మహత్యాయత్నాలు
ఎమ్మెల్యే బండ్లను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ ఓ యువకుడు సెల్ఫోన్ టవర్ ఎక్కగా.. అక్కడే నాయకులు ధర్నాలో భాగంగా బైఠాయించి అతనికి మద్దతుగా నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా గద్వాల మండలం అనంతాపురం గ్రామానికి చెందిన కార్యకర్త రహీమ్, దౌదర్పల్లికి చెందిన అనిల్, మల్డకల్ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన కుర్వ అయ్యన్న అనే కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా నాయకులు, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టులు పరుగు పెట్టేనా?
[ 07-07-2024]
ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారు. -
నడిగడ్డలో కొత్త సమీకరణం
[ 07-07-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లో గత శాసనసభ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో వెలుగు వెలిగిన భారాసకు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. -
చెంచు చిన్నారులతో వెట్టి
[ 07-07-2024]
నలమల్ల ప్రాంతంలో ఇటీవల చెంచుమహిళపై దాష్టీకం మరువకముందే మరో చెంచు చిన్నారులను జీతంగా పనిలో పెట్టుకుని వేధించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ కళాశాలపై విముఖం
[ 07-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. -
చేరువైన సాంకేతిక విద్య
[ 07-07-2024]
బీటెక్.. దేశంలో లక్షలాది విద్యార్థులు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎంచుకునే ప్రథమ మార్గం. -
పీహెచ్సీల్లో పరీక్షలు చేసే వారేరీ?
[ 07-07-2024]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎన్సీడీ కేంద్రాలు
[ 07-07-2024]
అసంక్రమిత వ్యాధుల నివారణకు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. -
చెంచుల్లో వేధిస్తున్న రక్తహీనత
[ 07-07-2024]
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని లోతట్టు చెంచుగూడెంలు రక్తహీనతకు నిలయంగా మారుతున్నాయి. -
కార్యశాలతో ముందడుగు
[ 07-07-2024]
తరగతి గదిలో విన్న పాఠ్యాంశాన్ని ప్రయోగాత్మకంగా చేయడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
[ 07-07-2024]
కృష్ణా మండలంలోని సారోపవర్ ప్లాంటు వద్ద శనివారం లారీ, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి